Asianet News TeluguAsianet News Telugu

ఏపీ టెన్త్ రిజల్ట్స్ నేడే: మార్కుల కేటాయింపు ఇలా...

ఏపీ టెన్త్ క్లాస్ పరీక్షా ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం నాడు విడుదల చేయనున్నారు. కరోనా కారణంగా టెన్త్, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం ఈ ఏడాది రద్దు చేసింది.

AP SSC Results 2021 to be declared today at 5 pm lns
Author
Guntur, First Published Aug 6, 2021, 10:53 AM IST


అమరావతి: ఏపీ రాష్ట్రానికి చెందిన టెన్త్ క్లాస్ ఫలితాలు శుక్రవారం నాడు విడుదలకానున్నాయి. ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు.గత ఏడాదితో పాటు ఈ ఏడాది కూడ టెన్త్ క్లాస్ పరీక్షలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ఏడాది టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. అయితే  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోపుగా పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేయలేమని భావించింది. దీంతో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.

also read:ఏపీ: రేపు టెన్త్ ఫలితాలు విడుదల

టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఫలితాలు ప్రకటనకు సంబంధించి ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ సూచనల మేరకు విద్యార్థులకు మార్కులను కేటాయించారు. విద్యార్థులకు ఇంటర్నల్‌గా 50 మార్కుల చొప్పున నిర్వహించిన 3 ఫార్మేటివ్ అసెస్‌మెంట్ల ఆధారంగా ఈ గ్రేడ్లు ప్రకటించాలని హైపవర్ కమిటీ సూచించింది.ఫలితాల విడుదల తర్వాత www.bse.ap.gov.in  వెబ్‌పైట్ నుండి మార్కుల షీట్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios