Asianet News TeluguAsianet News Telugu

ఇంటింటికి రేషన్ సరఫరా వాహనాలకు రంగులు: ఆదేశాలను వెనక్కి తీసుకొన్న ఎస్ఈసీ

రేషన్ వాహనాల రంగుల మార్పుపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం వెనక్కి తగ్గింది. వాహనాల రంగులను మార్చాలనే ఆదేశాలను వెనక్కి తీసుకొంది ఎన్నికల సంఘం.
 

AP SEC withdrawn orders on ration vehicles colours lns
Author
Guna, First Published Mar 2, 2021, 12:11 PM IST

అమరావతి: రేషన్ వాహనాల రంగుల మార్పుపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం వెనక్కి తగ్గింది. వాహనాల రంగులను మార్చాలనే ఆదేశాలను వెనక్కి తీసుకొంది ఎన్నికల సంఘం.

ఎస్ఈసీ ఆదేశాలను ఏపీ హైకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. అయితే ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం తాను ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకొంది. దీంతో పిటిషన్ ను డిస్పోజ్ చేసింది కోర్టు.ఇంటింటికి రేషన్ సరుకులను సరఫరా చేసే వాహనాలకు ఉన్న రంగులను మార్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఆదేశాలు ఇచ్చింది.

రంగులు మార్చకపోతే ఈ వాహనాలను తిప్పొద్దని ఎస్ఈసీ సివిల్ సప్లయిస్ శాఖను ఆదేశించింది. ఈ విషయమై ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. అయితే ఎన్నికలు లేని ప్రాంతంలో ఈ వాహనాల ద్వారా సరుకులు పంపిణీ చేయవచ్చని గతంలో కోర్టు ఆదేశించింది. 

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రంగులు మార్చాలని ఎస్ఈసీ కోరింది. ఈ విషయాన్ని కోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది.ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా  తమ ఆదేశాలను ఉపసంహరించుకొంటామని ఎస్ఈసీ ప్రకటించింది. దీంతో ఈ పిటిషన్ ను కోర్టు మంగళవారం నాడు డిస్పోజ్ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios