మళ్లీ ఇదేంది కేసీఆర్.. టీఆర్ఎస్పై నారా లోకేశ్ సెటైర్లు
తెలంగాణ ముందస్తు ఎన్నికల నగారాకు ముందే పార్టీల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలో టీఆర్ఎస్పై టీడీపీ నేత, ఏపీ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు.
తెలంగాణ ముందస్తు ఎన్నికల నగారాకు ముందే పార్టీల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలో టీఆర్ఎస్పై టీడీపీ నేత, ఏపీ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. తెలుగు వాళ్లంతా ఒక్కటంటూనే కేసీఆర్ మళ్లీ జాగో-బాగో అంటున్నారని ఎద్దేవా చేశారు.
ఆంధ్ర ఓట్లు లేకుండానే టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిందా అని నారా లోకేశ్ ప్రశ్నించారు. ఆంధ్రా ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పక్కనే కూర్చొబెట్టుకుంటున్నారని లోకేశ్ వ్యాఖ్యానించారు.