Asianet News TeluguAsianet News Telugu

చర్చలకు పిలిచిన ఏపీ సర్కార్: అలాంటిదేమీ లేదన్న ఉద్యోగ సంఘాలు


చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలకు రావాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయని ప్రచారం సాగింది. అయితే తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆహ్వానం రాలేదని ఉద్యోగ సంఘం నేతలు చెప్పారు.

AP minister Botsa Satyanaraya phoned to employee union leaders
Author
Guntur, First Published Jan 23, 2022, 4:50 PM IST


హైదరాబాద్: చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల నేతలకు AP Government ప్రతిపాదించింది. అయితే  ఈ ప్రతిపాదనను Employees Union తిరస్కరించాయని ప్రచారం సాగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని ఉద్యోగ సంఘం నేత బొప్ప రాజు వెంకటేశ్వర్లు ఖండించారు. తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆహ్వానం రాలేదని చెప్పారు. 

.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ఏపీ రాష్ట్ర మంత్రులు Botsa Satyanarayana, పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఏపీ రాష్ట్ర  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మతో కమిటీని ఏర్పాటు చేశారు సీఎం జగన్.

ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు  బొత్స సత్యనారాయణ,  పేర్ని నాని లు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించిందనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని కొందరు ఉద్యోగ సంఘం నేతలు చెబుతున్నారు.విజయవాడ రెవిన్యూ భవన్ లో ఏపీ జేఎసీ, ఏపీ జేఎసీ, అమరావతి రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు సమావేశమయ్యారు. ఉద్యోగుల సంఘం నేతలకు  ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, Perni Nani లు ఫోన్ చేశారని సాగుతున్న ప్రచారం ఒట్టిదేనని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.

ప్రభుత్వం నుండి చర్చలకు ఆహ్వానం రాలేదు: బొప్పరాజు

తమకు  ప్రభుత్వం నుండి చర్చల కోసం ఎలాంటి సమాచారం రాలేదని  ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. చర్చల కోసం తమకు మంత్రుల కమిటీ నుండి సమాచారం రాలేదని సమాచారం. మంత్రుల కమిటీ నుండి ఉద్యోగుల సంఘానికి చర్చల కోసం  ఆహ్వానం అందిందని ప్రచారం సాగుతుంది. అయితే తమకు మంత్రుల కమిటీ నుండి ఎలాంటి ఆహ్వానం రాలేదని ఉద్యోగుల సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం   YS Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.

మరో వైపు ఉేద్యోగ సంఘాలు సమ్మె కు వెళ్లాలని భావిస్తున్నాయి. ఈ విషయమై  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసును కూడా ఇవ్వనున్నాయి. ఈ విషయమై  ఉద్యోగ సంఘాలు మరోసారి సమావేశం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎస్ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ ట్రాప్ లో పడుతున్నారని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవోలతో తమకు వేతనాలు తగ్గిపోతాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అయితే ఈ వాదనతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ విబేధిస్తున్నారు.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం 98 వేల కోట్ల నుండి 62 వేల కోట్లకు పడిపోయిందన్నారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉందని కూడా సీఎస్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం కలగకుండా ఉండేలా జీవోలు జారీ చేశామన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios