Asianet News TeluguAsianet News Telugu

యువతి ఆరోపణల ఎఫెక్ట్: గుంటూరు డిఎఫ్ఓ మోహన్ రావు బదిలీ

గుంటూరు డిఎఫ్ఓ మోహన్‌రావుపై బదిలీ వేటు పడింది. ఆయనపై  వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి  ఆదేశించారు.
 

ap minister balineni srinivas reddy ordered to transfer guntur dfo mohan rao
Author
Guntur, First Published Jul 4, 2019, 2:52 PM IST

గుంటూరు:గుంటూరు డిఎఫ్ఓ మోహన్‌రావుపై బదిలీ వేటు పడింది. ఆయనపై  వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి  ఆదేశించారు.

గుంటూరు డిఎఫ్ఓ మోహన్ రావుపై ఓ యువతి ఆరోపణలు చేసింది. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోహన్ రావు రూ. 2 లక్షలు తీసుకొన్నాడని  బాధితురాలు ఆరోపించింది.

అంతేకాదు తనపై డిఎఫ్ఓ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని  కూడ ఆరోపణలు చేసింది. ఈ విషయమై గురువారం నాడు మంత్రి స్పందించారు.మోహన్ రావును బదిలీ చేయాలని  మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.  ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. 

ఈ విషయమై బాధితురాలు ఏపీ డిప్యూటీ సీఎం  సుచరితకు ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలను డిఎఫ్ఓ మోహన్ రావు తీవ్రంగా ఖండించారు. తనపై ఆ యువతి ఎందుకు ఈ ఆరోపణలు చేశారో తనకు తెలియదన్నారు. 

సంబంధిత వార్తలు

డిఎఫ్ఓ లైంగిక దాడి చేశాడు: సుచరితకు యువతి ఫిర్యాదు

 

Follow Us:
Download App:
  • android
  • ios