యువతి ఆరోపణల ఎఫెక్ట్: గుంటూరు డిఎఫ్ఓ మోహన్ రావు బదిలీ
గుంటూరు డిఎఫ్ఓ మోహన్రావుపై బదిలీ వేటు పడింది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
గుంటూరు:గుంటూరు డిఎఫ్ఓ మోహన్రావుపై బదిలీ వేటు పడింది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
గుంటూరు డిఎఫ్ఓ మోహన్ రావుపై ఓ యువతి ఆరోపణలు చేసింది. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోహన్ రావు రూ. 2 లక్షలు తీసుకొన్నాడని బాధితురాలు ఆరోపించింది.
అంతేకాదు తనపై డిఎఫ్ఓ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కూడ ఆరోపణలు చేసింది. ఈ విషయమై గురువారం నాడు మంత్రి స్పందించారు.మోహన్ రావును బదిలీ చేయాలని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.
ఈ విషయమై బాధితురాలు ఏపీ డిప్యూటీ సీఎం సుచరితకు ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలను డిఎఫ్ఓ మోహన్ రావు తీవ్రంగా ఖండించారు. తనపై ఆ యువతి ఎందుకు ఈ ఆరోపణలు చేశారో తనకు తెలియదన్నారు.
సంబంధిత వార్తలు
డిఎఫ్ఓ లైంగిక దాడి చేశాడు: సుచరితకు యువతి ఫిర్యాదు