Asianet News TeluguAsianet News Telugu

కోర్టు ధిక్కరణ: మరో ఇద్దరు ఐఏఎస్‌లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం.. 29న శిక్ష ఖరారు

కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు ఐఏఎస్‌లకు శిక్ష విధించింది ఏపీ  హైకోర్ట్. గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరికి శిక్ష పడింది. వీరికి ఈ నెల 29న  శిక్ష ఖరారు చేస్తామని ప్రకటించింది ఏపీ హైకోర్ట్. 

ap high court serious on two ias officials over contempt of court
Author
Amaravati, First Published Sep 15, 2021, 2:13 PM IST

కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు ఐఏఎస్‌లకు శిక్ష విధించింది ఏపీ  హైకోర్ట్. గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరికి శిక్ష పడింది. వీరికి ఈ నెల 29న  శిక్ష ఖరారు చేస్తామని ప్రకటించింది ఏపీ హైకోర్ట్. పట్టు పరిశ్రమల శాఖలో ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని గతంలో హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును అమలు చేయకపోవడంతో కోర్ట్ ధిక్కార నేరం కింద చర్యలకు దిగిన న్యాయస్థానం.. కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.  

Follow Us:
Download App:
  • android
  • ios