గనుల తవ్వకాల్లో అక్రమాలు: ఏపీ సర్కార్ కొరడా, డ్రోన్ల ద్వారా స్పెషల్ డ్రైవ్
రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా జరుగుతున్న గనుల తవ్వకాలకు చెక్ పెట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అనకాపల్లిలోని ఓ మైనింగ్ కంపెనీ కార్యకలాపాలపై సీఐడీ విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
విశాఖపట్నం జిల్లాలో మైనింగ్ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సహజ వనరుల దోపిడిపై ఇప్పటికే సర్కార్కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో విశాఖలోని క్వారీలపై తనిఖీల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. డ్రోన్లు, జీపీఎస్ ఆధారిత సర్వే ద్వారా అక్రమాలను గుర్తించాలని నిర్ణయించింది. ఇష్టారాజ్యంగా జరుగుతున్న గనుల తవ్వకాలకు చెక్ పెట్టనుంది. అనకాపల్లిలోని ఓ మైనింగ్ కంపెనీ కార్యకలాపాలపై సీఐడీ విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది.