సింహాచలం భూముల్లో అక్రమాలు: మాజీ ఈవోపై ఏపీ సర్కార్ వేటు
సింహాచలం భూముల అక్రమాలపై ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గతంలో ఈవోగా పనిచేసిన రామచంద్రమోహన్ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు దేవాదాయ శాఖ కమీషనర్. సింహాచలం దేవస్థానం రికార్డుల్లో నుంచి పెద్ద ఎత్తున భూములను తప్పించారని రామచంద్రమోహన్పై అభియోగాలు వున్నాయి.
సింహాచలం భూముల అక్రమాలపై ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గతంలో ఈవోగా పనిచేసిన రామచంద్రమోహన్ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు దేవాదాయ శాఖ కమీషనర్. సింహాచలం దేవస్థానం రికార్డుల్లో నుంచి పెద్ద ఎత్తున భూములను తప్పించారని రామచంద్రమోహన్పై అభియోగాలు వున్నాయి. సుమారు 700 ఎకరాలను సింహాచలం దేవస్థానం రికార్డుల నుంచి తప్పించినట్లు గుర్తించారు. అలాగే మాన్సాస్ ట్రస్ట్ భూముల్లోనూ రామచంద్రమోహన్ అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.