కేంద్ర ప్రభుత్వం బాటలో ఏపీ సర్కార్ నడుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ఆస్తుల మోనటైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మిషన్ బిల్డ్ ఏపీలో భాగంగా విజయవాడలోని స్టేట్ గెస్ట్‌హౌస్ ప్రాంగణాన్ని కమర్షియల్ డెవలప్‌మెంట్ కోసం అప్పగించింది

కేంద్ర ప్రభుత్వం బాటలో ఏపీ సర్కార్ నడుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ఆస్తుల మోనటైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మిషన్ బిల్డ్ ఏపీలో భాగంగా విజయవాడలోని స్టేట్ గెస్ట్‌హౌస్ ప్రాంగణాన్ని కమర్షియల్ డెవలప్‌మెంట్ కోసం అప్పగించింది. డెవలప్‌మెంట్ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. అలాగే మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను రుద్రాభిషేక్ ఎంటర్‌ ప్రైజెస్ లిమిటెడ్‌కు అప్పగించింది. మొత్తం 3.26 ఎకరాల్లో విస్తరించి వుంది స్టేట్ గెస్ట్ హౌస్. లక్ష చదరపు మీటర్లలో స్టేట్ గెస్ట్ హౌస్ పున: నిర్మాణం చేపట్టనుంది ప్రభుత్వం.