ఈఏపీసెట్లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలగింపు: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం
ఈఏపీసెట్లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మార్కులకు ఇస్తున్న 25 శాతం వెయిటేజ్ తొలగిస్తున్నట్లు ఆదేశాల్లో తెలిపింది
ఈఏపీసెట్లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మార్కులకు ఇస్తున్న 25 శాతం వెయిటేజ్ తొలగిస్తున్నట్లు ఆదేశాల్లో తెలిపింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకింగ్స్ కేటాయిస్తామని వెల్లడించింది. కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తన ఆదేశాల్లో తెలిపింది.