ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వాల్మీకి, బోయ, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు వున్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి గాను కమిటీని ఏర్పాటు చేసింది

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వాల్మీకి, బోయ, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు వున్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి గాను కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ ఆనంద్‌తో ఏక సభ్య కమీషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 3 నెలల్లోగా నివేదిక అందించాలని శామ్యూల్‌ను ఏపీ ప్రభుత్వం బుధవారం ఆదేశించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred