Asianet News TeluguAsianet News Telugu

ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత: జగన్ సర్కార్ నిర్ణయం

 ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు కరోనా వ్యాక్సిన్ వేసే విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

AP Government top priority to  five year old children mothers for corona vaccination lns
Author
Guntur, First Published Jun 8, 2021, 3:23 PM IST

విజయవాడ: ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు కరోనా వ్యాక్సిన్ వేసే విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కరోనా వ్యాక్సినేషన్ నిబంధనల్లో ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం నాడు మార్పులు చేసింది. 45 ఏళ్లు లేకున్నా కూడ ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు వ్యాక్సిన్ వేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకొంది. 

also read:మీ సంకల్పం చాలా గొప్పది..: లేఖ ద్వారా ప్రధానిపై ప్రశంసలు కురిపించిన జగన్

రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లుల జాబితాను  తయారు చేసి వ్యాక్సిన్ వేసే విషయంలో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. ఆశా వర్కర్తు, ఆరోగ్య కార్యకర్తలు ఈ జాబితాను తయారు చేయనున్నారు. ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు టోకెన్లను  ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు అందించనున్నారు. ఈ టోకెన్ల ఆధారంగా వ్యాక్సిన్ అందించనున్నారు.రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్నట్టుగా కేంద్రం సోమవారం నాడు ప్రకటించింది. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ఉచితంా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు ఇవాళ కొత్త మార్గదర్శకాలను కూడ కేంద్రం విడుదల చేసింది. ఈ నెల 21వ తేదీ నుండి కొత్త గైడ్‌లైన్స్ అమల్లోకి రానున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios