టీటీడీ ట్రస్ట్ బోర్డ్: 50 మందితో ప్రత్యేక ఆహ్వానితుల జాబితా... ఛాన్స్ దక్కింది వీరే..!
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కొత్త పాలక మండలి సభ్యులను ఏపీ ప్రభుత్వం బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 50 మందితో ప్రత్యేక ఆహ్వానితుల జాబితాను విడుదల చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కొత్త పాలక మండలి సభ్యులను ఏపీ ప్రభుత్వం బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 50 మందితో ప్రత్యేక ఆహ్వానితుల జాబితాను విడుదల చేసింది.
ప్రత్యేక ఆహ్వానితులు:
- భూమన కరుణాకర్ రెడ్డి
- కుమార గురు
- రమేశ్ శెట్టి
- సంపత్ రవి నారాయణ్
- సుబ్బారెడ్డి
- భాస్కర్ రావు
- అమూల్ కాలే
- గోవింద హరి
- మంజునాథ్
- లల్లు అగర్వాల్
- రంగమ్మ
- రూపనాథ్ రెడ్డి
- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- నాగార్జున రెడ్డి
- తాడిశెట్టి మురళి
అంతకుముందు 25 మందితో టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితాను ఏపీ ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహరాష్ట్రలకు టీటీడీ బోర్డులో చోటు దక్కింది. బోర్డు సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులను కూడ ఏపీ ప్రభుత్వం నియమించింది.
ఇప్పటికే టీటీడీ ఛైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతున్నారు.టీటీడీ బోర్డు సభ్యులుగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, శశిధర్, కల్వకుర్తి విద్యాసాగర్, లక్ష్మీనారాయణ, మూరంశెట్టి రాములు, నందకుమార్, జూపల్లి రామేశ్వర్ రావు,. రాజేశర్మ, జీవన్ రెడ్డి, పార్ధసారథిరెడ్డి, పోలకల ఆశోక్, మల్లాడి కృష్ణారావు, శంకర్, విశ్వనాథ్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, గొల్ల బాబురావు.మధుసూదన్ యాదవ్ తదితరులకు చోటు దక్కింది.
టీటీడీలో ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు దక్కింది. కోస్తా నుండి కనిగిరి ఎమ్మెల్యే మధుసూధన్ యాదవ్ , ఉత్తరాంధ్ర నుండి పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు, రాయలసీమ నుండి కాటసాని రాంభూపాల్ రెడ్డకి చోటు దక్కింది. కర్ణాటక నుండి శశిధర్ , శంకర్, డాక్టర్ కేతన్ దేశాయ్ కి చోటు లభించింది.
తమిళనాడు నుండి కన్నయ్య, నందకుమార్ , జె. శ్రీనివాసన్, రాజేష్ శర్మ, జీవన్ రెడ్డి, సౌరభ్ లకు చోటు దక్కింది.మహారాష్ట్ర సీఎం కోటాలో మిలింద్ కు అవకాశం వచ్చింది. తెలంగాణ నుండి మూరంశెట్టి రాములు, నందకుమార్, జూపల్లి రామేశ్వరరావు, రాజేశర్మ, పార్ధసారథిరెడ్డి. జీవన్ రెడ్డిలకు చోటు దక్కింది.ప్రత్యేక ఆహ్వానితుల జాబితాను కూడ ఏపీ ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది. ఈ జాబితాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు.