విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని శంకుస్థాపన వాయిదా: దసరాకు ముహుర్తం
విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 16వ తేదీన ఎగ్జిక్యూటివ్ రాజధానికి శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
అమరావతి: విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 16వ తేదీన ఎగ్జిక్యూటివ్ రాజధానికి శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మోడీ అపాయింట్ మెంట్ కోసం సీఎం జగన్ కోరారు.
మరో వైపు మూడు రాజధానులపై హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులున్నాయి. మరో వైపు ఈ కార్యక్రమానికి ప్రధాని కూడ రావాలని ప్రభుత్వం కోరుకొంటుంది. ప్రధాని అపాయింట్ మెంట్ లభిస్తే సీఎం జగన్ స్వయంగా మోడీని కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు.మూడు రాజధానుల విషయంలో ఏపీ హైకోర్టు యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించింది.ఈ నెల 14వ తేదీ వరకు స్టేటస్ కో విధించింది.
ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం కోరింది. షార్ట్ నోటీసులో ప్రధాని ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ నెల 18 తర్వాత మంచి రోజులు లేవు. దీంతో దసరాకు విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ నెల 16వ తేదీన ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడినట్టుగా సమాచారం.