వైసీపీ చీఫ్  వైఎస్ జగన్ కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై  ఏపీ హైకోర్టులో బుధవారం నాడు వాదనలు జరిగాయి

అమరావతి: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో బుధవారం నాడు వాదనలు జరిగాయి. ఈ విషయమై తమ వాదనను విన్పించేందుకు మరింత సమయం కావాలని ఏపీ ప్రభుత్వం కోర్టును కోరింది. ఈ కేసు విచారణను ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

గత ఏడాది అక్టోబర్ మాసంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీనివాసరావు అనే యువకుడు కత్తితో దాడి చేశారు. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్ని ఏపీ సర్కార్ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ విషయమై బుధవారం నాడు హైకోర్టులో వాదనలు జరిగాయి.

ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో ఎన్ఐఏకు కేసును అప్పగించడాన్ని ఏపీ సర్కార్ తప్పుబడుతోంది. ఇదే విషయమై ఎన్ఐఏ విచారణను తక్షణమే నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు విన్పించారు. 

ఈ పిటిషన్‌పై ఎన్ఐఏ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. అయితే తమ వాదనను విన్పించేందుకు గాను మరింత సమయం కావాలని ఏపీ సర్కార్ హైకోర్టును ఇవాళ కోరింది. దీంతో ఈ కేసును ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.