Asianet News TeluguAsianet News Telugu

వివాదాస్పద వ్యాఖ్యలు: ముస్లింలకు క్షమాపణలు చెప్పిన ఏపీ డీప్యూటీ సీఎం నారాయణ స్వామి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శనివారం రోజున తబ్లీగి జమాత్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. వారు కరోనా వైరస్ ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపాడు.

AP deputy CM Narayana Swamy blames  Tablighi Jamaat for Covid-19; apologises later
Author
Amaravathi, First Published Apr 12, 2020, 9:00 AM IST

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శనివారం రోజున తబ్లీగి జమాత్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. వారు కరోనా వైరస్ ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపాడు.

ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా తాను ఎక్కడ మాట్లాడలేదని,  తనకు ముస్లిం సోదరులు పట్ల అపార గౌరవం ఉందని,  మాటలను బేషరతుగా వాపసు తీసుకుంటున్నానని నారాయణ స్వామి అన్నారు. 

తన మాటలు ముస్లిం సోదరులను ఇబ్బందికి గురిచేస్తే క్షమించాలని, తాను  కించపరిచినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, అల్లా దయతో దేశం నుంచి కరోనా మహమ్మారి త్వరలోనే వెళ్లిపోవాలని కోరుకుంటున్నానని నారాయణ స్వామి అన్నారు. 

వాస్తవానికి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఒక ఫేక్ వీడియోను చూసి పొరబడి, ఎక్సయిజ్ అధికారుల సమావేశంలో వారు కరోనా వైరస్ ని వ్యాప్తి చేసేందుకు స్పూన్లు, ప్లేట్లు నాకుతున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ కరోనా వైరస్ వ్యాప్తికి మతం రంగు పులమొద్దు అని కోరిన వారం రోజుల్లోనే ఉప ముఖ్యమంత్రి గారు ఈ వ్యాఖ్యలను చేయడం గమనార్హం. 

ఇక నిన్న ఆంధ్ర ప్రదేశ్ లో కొనసాగుతున్న లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీతో తన అభిప్రాయాలను పంచుకున్నారు సీఎం వైఎస్ జగన్‌. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఆళ్లనాని, హోంమంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నామని...అదే సమయంలో మానవతా కోణంలో స్పందిస్తున్నామని జగన్ ప్రధానికి తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.4 కోట్లకుపైగా ఉన్న  కుటుంబాలను, వారి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నామని...కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి పరీక్షలు చేసి వైద్యం అందిస్తున్నామన్నారు. 

''ఏపీలో 2,61,216 గ్రామ, వార్డు వాలంటీర్లు, 40వేల మంది ఆశ వర్కర్లు, 20,200 మంది ఏఎన్‌ఎంలు ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.  కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి వారికి దాదాపు 3వేలమంది వైద్యులు సేవలు అందిస్తున్నారు. అలాగే కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ వ్యూహం కొనసాగుతోంది. కరోనా ఉన్న ప్రాంతాలలో  ప్రతి ఇంటిని పర్యవేక్షించడానికి, ఉద్ధృతంగా పరీక్షలు నిర్వహించడానికి, 141 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను హాట్‌స్పాట్లుగా గుర్తించాం'' అని వివరించారు. 

''ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచుతున్నాం. క్రిటికల్‌ కేర్‌ కోసం నాలుగు అత్యాధునిక ఆస్పత్రులను ఏర్పాటుచేసుకున్నాం. 13 జిల్లాల్లోని ప్రతి జిల్లాకూ ఒక కోవిడ్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాల్లో వీటికి అదనంగా మరో 78 ఆస్పత్రులను ఏర్పాటు చేసుకుంటున్నాం. సమర్థవంతంగా క్వారంటైన్‌ చేయడానికి ప్రతి జిల్లాలో కోవిడ్‌ కేర్‌సెంటర్లను ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో 26వేల బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయి'' అని జగన్ ప్రధానికి తెలియజేశారు. 

''రాష్ట్రంలోని సామాన్యులపై లాక్‌డౌన్‌ ప్రభావానికి సంబంధించి కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిదే ప్రధాన భూమిక. జీఎస్‌డీపీలో 35శాతం, ఉపాధికల్పనలో 62శాతం వాటా వ్యవసాయానిదే. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల రవాణా గణనీయంగా పడిపోయింది. నిలిపివేస్తారనే భయంతో 25శాతం మించి ట్రక్కులు తిరగడంలేదు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులను భద్రపరచడానికి, నిల్వచేయడానికి సరిపడా గోదాములు లేవు'' అని తెలిపారు. 

''మార్కెట్లు నడవకపోవడంతో ధాన్యం, మొక్కజొన్న, మిర్చి, పొగాకు, అరటి, బొప్పాయి, కూరగాయలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. కాని స్థానికంగా వీటిని ఎంతవరకు వినియోగించగలం? ఇప్పుడున్న పరిస్థితి కొనసాగితే లక్షలాది వ్యవసాయ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయి. నిల్వచేయడానికి తగిన స్టోరేజీ సదుపాయం లేక ఎగుమతులు లేక ఆక్వా రంగంకూడా తీవ్రంగా దెబ్బతింటోంది'' అని రైతుల సమస్యలను పీఎం దృష్టికి తీసుకెళ్లారు. 

Follow Us:
Download App:
  • android
  • ios