Asianet News TeluguAsianet News Telugu

గవర్నర్‌తో ఏపీ సీఎం జగన్ దంపతుల భేటీ

ఏపీ సీఎం జగన్ దంపతులు  సోమవారం నాడు  గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో భేటీ అయ్యారు. 

AP CM YS Jagan meets Governor Biswabhusan Harichandan lns
Author
Guntur, First Published Jun 14, 2021, 5:39 PM IST

అమరావతి:ఏపీ సీఎం జగన్ దంపతులు  సోమవారం నాడు  గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో భేటీ అయ్యారు. గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీల  నియామకం కోసం ప్రభుత్వం నాలుగు పేర్లను గవర్నర్ కు సిఫారసు చేసింది. అయితే ఇద్దరి పేర్లపై గవర్నర్ అభ్యంతరం చెబుతున్నారని సమాచారం.  ఇద్దరిపై కేసులున్న నేపథ్యంలో గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.  నలుగురు ఎమ్మెల్సీ పేర్లపై కూడ జగన్ చర్చించే అవకాశం ఉంది. 

AP CM YS Jagan meets Governor Biswabhusan Harichandan lns

ఏపీ సీఎం వైఎస్ జగన్  గత వారంలో ఢిల్లీలో పర్యటించారు. ఢిల్లీ పర్యటన తర్వాత గవర్నర్ తో భేటీ కావడం ప్రాధాన్యత నెలకొంది.   కరోనా కారణంగా సీఎం జగన్  గవర్నర్ ను కలవలేదు.

AP CM YS Jagan meets Governor Biswabhusan Harichandan lns

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియతో పాటు కరోనా పరిస్థితులపై జగన్  గవర్నర్ కు వివరించే అవకాశం ఉంది. గత ఏడాదిలో దీపావళి సమయంలో  గవర్నర్ దంపతులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ దంపతులు భేటీ అయ్యారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios