Asianet News TeluguAsianet News Telugu

కరోనా సోకినా భయమొద్దు... 85శాతం మందికి అలాగే నయం: సీఎం జగన్

ఆంధ్ర ప్రదేశ్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు.

AP CM YS Jagan Held review meeting on covid19
Author
Amaravathi, First Published Jul 20, 2020, 8:16 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి సహా కీలక అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా రాష్ట్రలో కోవిడ్‌ విస్తరణ, తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించిన అధికారులు. టెస్టుల సంఖ్య బాగా పెంచుతున్నామని...ప్రతి రోజూ 35 నుంచి 45వేల వరకూ పరీక్షలు చేస్తామన్నారు అధికారులు. టెస్టులు బాగా పెంచడంతో పాటు, ఇతర రాష్ట్రాల సరిహద్దులు పూర్తిగా తెరవడం వల్ల రాకపోకలు బాగా జరుగుతున్నందువల్ల కేసుల సంఖ్య పెరిగిందని  అధికారులు సీఎంకు వివరించారు.

కోవిడ్‌ కేసుల కోసం నిర్దేశించుకున్న ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలపైన దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. వైద్యుల పరంగా, వసతుల పరంగా, నాణ్యమైన సేవలపరంగా ఈ ఆస్పత్రులను బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో కోవిడ్‌ ఆస్పత్రులపై దృష్టి పెట్టాలని సూచించారు. క్రిటికల్‌ కేర్‌ కోసం పెట్టుకున్న రాష్ట్రస్థాయి 5 ప్రధాన ఆస్పత్రుల్లో వైద్యులపై పని భారం లేకుండా ప్రణాళిక తయారు చేయాలని....ఈ ఐదు ఆస్పత్రుల్లో సేవల నాణ్యత ఇంకా పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై వెంటనే ఆలోచనలు చేయాలని ఆదేశించారు. 

అలాగే ప్రస్తుతం ఉన్న రాష్ట్రస్థాయి కోవిడ్‌ ఆస్పత్రుల సంఖ్య 5 నుంచి కనీసం 10 వరకూ పెంచాలని ఆదేశించారు. దీని కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఇందులో క్రిటికల్‌ కేర్‌ సౌకర్యాలు అందించాలని... దీని వల్ల వైద్యులపై పని భారం తగ్గుతుందన్న సీఎం అన్నారు. వైద్యులపై విపరీత పని భారం పడకుండా.. వారి నుంచి నాణ్యమైన సేవలు పొందాలన్నారు. త్వరగా వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు.

read more  తూర్పు గోదావరిలో తగ్గని కరోనా: ఏపీలో 53 వేలు దాటిన కేసులు, 700కు చేరువలో మరణాలు 

కోవిడ్‌ కేసుల కోసం ఉద్దేశించిన 84 ఆస్పత్రులను పూర్తి నియంత్రణలోకి తీసుకోవాలన్నారు. రాష్ట్రస్థాయి కోవిడ్‌ఆస్పత్రుల మాదిరిగా ఈ ఆస్పత్రులు కూడా పూర్తిస్థాయి సేవలు అందించడంపై దృష్టి పెట్టాలన్నారు. ఈ ఆస్పత్రులపై రెండు, మూడు రోజుల్లో నివేదిక తయారు చేయాలని... మౌలిక సదుపాయాల పరంగా, వైద్య సిబ్బంది పరంగా ఏ అవసరాలు ఉన్నాయన్న దానిపై వివరాలు నివేదికలో ఉండాలన్నారు. 

 కోవిడ్‌ కోసం నిర్దేశించిన ఆస్పత్రుల్లో వైద్య పరంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం రాయితీలు ఇచ్చేందుకు సిద్ధమని సీఎం వెల్లడించారు.  దీని వల్ల మౌలిక సదుపాయాలు పెరుగుతాయని, వైద్యులు, సిబ్బంది సమర్థవంతంగా పని చేస్తారన్నారు. 

టెలి మెడిసిన్‌పై ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలని సీఎం ఆదేశించారు. మందులు ఇంటికి సరఫరా చేస్తున్నారా? లేదా? మరోసారి పర్యవేక్షణ చేయాలని సీఎం సూచించారు. వైద్య రంగంలో చేపట్టనున్న నాడు–నేడు కార్యక్రమాలపై ఫోకస్‌ పెంచాలన్నారు. ఇవి పూర్తయితేనే కోవిడ్‌ లాంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోగలమని పేర్కొన్నారు. 

కోవిడ్‌పై మరింత అవగాహన కలిగించేలా ఉద్ధృతంగా ప్రచారం చేయాలని సీఎం ఆదేశించారు. కోవిడ్‌ సోకిందన్న అనుమానం వస్తే ఏం చేయాలి? ఎవర్ని కలవాలి? అన్నది అందరికీ తెలియాలన్నారు. ఎలాంటి భయాందోళన వద్దని ప్రజలకు భరోసా కల్పించాలని అన్నారు. కోవిడ్‌ ఎవరికైనా రావొచ్చని... 85 శాతం మంది ఇళ్లలోనే ఉండి నయం అవుతున్నాయని...క్షేత్రస్థాయిలో ఈ  సమాచారాన్ని తెలియజేస్తూ హోర్డింగ్స్‌ పెట్టాలని సీఎం ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లో కూడా ఈ హోర్డింగ్స్‌ పెట్టాలని సీఎం ప్రత్యేకంగా తెలిపారు. 

క్వారంటైన్‌ సెంటర్ల సంఖ్య పెంచడం కన్నా ఉన్నవాటిలో క్వాలిటీ మీద దృష్టి పెట్టాలన్నారు.  కోవిడ్‌ ఉందా? లేదా? అన్నది తెలుసుకోవడానికి  ర్యాపిడ్‌ టెస్టులు అందుబాటులోకి వచ్చినందున ఎవరిని ఎక్కడ పెట్టాలన్న దానిపై స్పష్టత వస్తుందని, ఆ తర్వాత వారికి మంచి సేవలు అందించాలన్నారు. అలాగే కాల్‌ సెంటర్‌ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, వినతుల మీద ప్రత్యేక దృష్టి వహించాలన్నారు. వచ్చే మూడు, నాలుగు నెలలపాటు నిర్దేశించుకున్న కార్యాచరణను పటిష్టంగా అమలు చేయాలన్న సీఎం జగన్ ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios