ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కాన్వాయ్‌ని నెల తిరక్కుండానే మార్చివేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ప్రభుత్వం ఆయనకు ప్రత్యేక కాన్వాయ్‌ని సమకూర్చిన సంగతి తెలిసిందే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కాన్వాయ్‌ని నెల తిరక్కుండానే మార్చివేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ప్రభుత్వం ఆయనకు ప్రత్యేక కాన్వాయ్‌ని సమకూర్చిన సంగతి తెలిసిందే.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తాజాగా ఇప్పుడు ఆ కాన్వాయ్ స్థానంలో ఆరు కొత్త బ్లాక్ ఫార్చ్యూనర్ వాహనాలు వచ్చి చేరాయి. జగన్ భద్రత దృష్ట్యా ప్రభుత్వం కొత్తగా ఈ వాహనాలను కొనుగోలు చేసింది. ఇదే సమయంలో పాత కాన్వాయ్‌ని హైదరాబాద్‌కు చేర్చారు.

ఇకపై జగన్ ఎప్పుడు హైదరాబాద్ వెళ్లినా ఇదే కాన్వాయ్‌ని ఉపయోగిస్తారు. ఇక కొత్త కాన్వాయ్‌లోని వాహనాలకు ఏపీ 39 పీఏ 2345 నెంబర్‌ను కేటాయించారు.