Asianet News TeluguAsianet News Telugu

ఆస్తుల కేసు: డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేసిన ఏపీ సీఎం జగన్

పెన్నా కేసు నుండి తన పేరును తొలగించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో  మంగళవారం నాడు డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయమై తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడ డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు.
 

AP CM YS Jagan files discharge petition in assets case lns
Author
Hyderabad, First Published Jul 13, 2021, 4:36 PM IST


హైదరాబాద్:  పెన్నా కేసులో  ఏపీ సీఎం  వైఎస్ జగన్ మంగళవారం నాడు డిశ్చార్జ్ పిటిషన్ ను దాఖలు చేశారు.సీబీఐ కోర్టులో జగన్  ఆస్తుల కేసు విచారణ జరిగింది. పెన్నా చార్జీషీట్ నుండి తన పేరును తొలగించాలని సీఎం జగన్ కోరారు. పెన్నా చార్జీషీట్ నుండి తన పేరును తొలగించాలని జగన్ కోర్టును కోరారు. 

ఇదే కేసులో కూడ తన పేరును కూడ తొలగించాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి  పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై డిశ్చార్జి పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరింది. ఈ నెల 22కి ఈ విషయమై విచారణను వాయిదా వేసింది కోర్టు.  మరో వైపు ఇదే కేసులో రాజగోపాల్, శ్యామ్యూల్ డిశ్చార్జి పిటిషన్లపై విచారణను కూడ ఈ నెల 22కి వాయిదా వేసింది. ఇండియా సిమెంట్స్ కేసు విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది న్యాయస్థానం.
 

Follow Us:
Download App:
  • android
  • ios