టీచర్లకు ఏపీ సర్కార్ తీపి కబురు: బదిలీలకు జగన్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. బదిలీలకు ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫైల్ మీద జగన్ సంతకం చేశారు
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. బదిలీలకు ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫైల్ మీద జగన్ సంతకం చేశారు. రెండు మూడు రోజుల్లో బదిలీలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. '
ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులంతా బదిలీలకు అర్హులు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ల ప్రక్రియ జరుగుతుంది. ఏపీలో మూడేళ్లుగా స్థాన చలనం కోసం టీచర్లు ఎదురుచూస్తున్నారు.