రిపబ్లిక్ డే వేడుకలు: విద్యుత్ దీపాల వెలుగులో ఏపీ సచివాలయం
70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ముస్తాబైంది. అందుకు అనుగుణంగా వెలగపూడిలోని సచివాలయం, అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ భవనాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ముస్తాబైంది. అందుకు అనుగుణంగా వెలగపూడిలోని సచివాలయం, అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ భవనాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. విద్యుత్ కాంతుల వెలుగులో సచివాయలం వెలిగిపోతోంది.
మరోవైపు దేశరాజధాని ఢిల్లీలోని రాజ్పథ్ ప్రాంతం మొత్తం వేడులకు సిద్ధమూంది. ఇప్పటికే భద్రతా దళాల రిహార్సల్స్ కూడా జరిగాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంపోసా ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.