ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో కొత్త వర్సిటీలు, విద్యార్ధులకు లాప్టాప్లు: ఏపీ కేబినెట్ నిర్ణయాలివే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది.
ఏపీ కేబినెట్ నిర్ణయాలు:
- మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ల కొనుగోలుకు ఆమోదం
- 28 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం ప్రచార కార్యక్రమం
- 9-12వ తరగతి విద్యార్ధులకు ల్యాప్టాప్ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్
- ప్రకాశం జిల్లా పేర్నమెట్టలో ఆంధ్రకేసరి యూనివర్సిటీకి ఆమోదం
- విజయనగరంలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ వర్సిటీకి ఆమోదం
- మౌలిక సదుపాయాల కల్పనకు రూ..5,990 కోట్ల మేర బ్యాంకు గ్యారెంటీకి కేబినెట్ ఆమోదం
- 2021-24 ఐటీ విధానానికి ఆమోదం
- ఏపీ భూమి హక్కు చట్ట సవరణకు ఆమోదం
- రీసర్వేలో పట్టాదారులకు ధృవపత్రాలు జారీ
- హంద్రీనివా సుజల స్రవంతి పథకంలో పుట్టపర్తి నియోజకవర్గానికి రూ.864 కోట్లతో నీటి సరఫరాకు కేబినెట్ ఆమోదం
- విజయవాడ గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్కు గ్రీన్ సిగ్నల్
- సత్యనారాయణపురం, మాచవరం పరిధిలోని కొన్ని ప్రాంతాలను కొత్త పోలీస్ స్టేషన్ పరిధిలో చేర్చేందుకు కేబినెట్ అంగీకారం
- కాకినాడ పోర్టులో రీ గాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుపై చర్చ
- మారిటైమ్ బోర్డుతో సంయుక్త కార్యకలాపాల నిర్వహణకు అనుమతి
- విశాఖ నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్ భూ కేటాయింపునకు ఆమోదం
- 81 ఎకరాల భూ కేటాయింపుకు అంగీకారం తెలిపిన మంత్రివర్గం
- రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్ సీలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు ఆమోదం.