నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 8.15 గంటలకు శాసనసభ వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశం జరుగుతుంది.. 9.15 గంటలకు శాసనసభ, 9.45 గంటలకు శాసనమండలి సమావేశాలు జరుగుతాయి.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 8.15 గంటలకు శాసనసభ వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశం జరుగుతుంది.. 9.15 గంటలకు శాసనసభ, 9.45 గంటలకు శాసనమండలి సమావేశాలు జరుగుతాయి. దివంగత మాజీ ప్రధాని వాజ్పేయ్, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణలకు సంతాపం తెలిపిన అనంతరం సభ ప్రారంభమవుతుంది.