Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం 8,83,210కి చేరిక

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 128 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 83వేల 210 కి చేరుకొన్నాయి.

andhrapradesh reports new 128 corona cases, total rises to 8,83,210 lns
Author
Guntur, First Published Jan 4, 2021, 6:20 PM IST


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 128 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 83వేల 210 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు.  చిత్తూరు,నెల్లూరు,శ్రీకాకుళం  జిల్లాల్లో ఒక్కరి చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,118కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,2002,494 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 29,714 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 128 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 73 వేల 149 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 2,943 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.


గత 24 గంటల్లోఅనంతపురంలో006, చిత్తూరులో 023,తూర్పుగోదావరిలో 019, గుంటూరులో 015, కడపలో 009, కృష్ణాలో 015, కర్నూల్ లో 012, నెల్లూరులో 008, ప్రకాశంలో 003, శ్రీకాకుళంలో 006, విశాఖపట్టణంలో 001, విజయనగరంలో 001,పశ్చిమగోదావరిలో 003 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,397, మరణాలు 597
చిత్తూరు  -86,325,మరణాలు 844
తూర్పుగోదావరి -1,23,785 మరణాలు 636
గుంటూరు  -74,872, మరణాలు 666
కడప  -55,037, మరణాలు 461
కృష్ణా  -47,926,మరణాలు 666
కర్నూల్  -60,602, మరణాలు 487
నెల్లూరు -62,124, మరణాలు 506
ప్రకాశం -62,049, మరణాలు 579
శ్రీకాకుళం -45,974, మరణాలు 347
విశాఖపట్టణం  -59,258, మరణాలు 552
విజయనగరం  -41,039, మరణాలు 238
పశ్చిమగోదావరి -93,927, మరణాలు 539


 

Follow Us:
Download App:
  • android
  • ios