Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు: మొత్తం కేసులు 8,75,531కి చేరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 506 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 75వేల 531 కి చేరుకొన్నాయి. 

Andhrapradesh reports 506 new corona cases, total rises to 8,75,531 lns
Author
Amaravathi, First Published Dec 13, 2020, 5:15 PM IST


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 506 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 75వేల 531 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 05 మంది కరోనా మరణించారు.కరోనాతో చిత్తూరు, గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల్లో చనిపోయారు.  దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,057కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,08,30,990 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 63,873మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 0520 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 63వేల 506 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా4,966 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.


గత 24 గంటల్లో 
అనంతపురంలో 17,చిత్తూరులో 104,తూర్పుగోదావరిలో 041, గుంటూరులో 069, కడపలో012, కృష్ణాలో 059, కర్నూల్ లో 28, నెల్లూరులో 029, ప్రకాశంలో 20, శ్రీకాకుళంలో 025, విశాఖపట్టణంలో 023, విజయనగరంలో 013,పశ్చిమగోదావరిలో 066కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,006, మరణాలు 594
చిత్తూరు  -84,846,మరణాలు 835
తూర్పుగోదావరి -1,22,988, మరణాలు 636
గుంటూరు  -73,944, మరణాలు 657
కడప  -54,641, మరణాలు 454
కృష్ణా  -46,684,మరణాలు 654
కర్నూల్  -60,404, మరణాలు 487
నెల్లూరు -61,782, మరణాలు 501
ప్రకాశం -61,783, మరణాలు 578
శ్రీకాకుళం -45,708, మరణాలు 346
విశాఖపట్టణం  -58,636, మరణాలు 547
విజయనగరం  -40,862 మరణాలు 238
పశ్చిమగోదావరి -93,352, మరణాలు 530

 

 

Follow Us:
Download App:
  • android
  • ios