Asianet News TeluguAsianet News Telugu

పశ్చిమగోదావరిలో కరోనా జోరు: ఏపీలో తగ్గుముఖం పట్టిన కోవిడ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 91,231మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 3620 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతోరాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,85,716కి చేరుకొంది.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 41 మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 12,671కి చేరింది.

Andhra pradesh reports3620 corona cases, total rises to 18,85,716 lns
Author
Guntur, First Published Jun 29, 2021, 4:55 PM IST

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 91,231మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 3620 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతోరాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,85,716కి చేరుకొంది.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 41 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 12,671కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 5,757మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 18 లక్షల 32 వేల 971 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 40,074 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,18,95,922 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో190,చిత్తూరులో 451, తూర్పుగోదావరిలో617, గుంటూరులో299,కడపలో 137, కృష్ణాలో332, కర్నూల్ లో044, నెల్లూరులో210, ప్రకాశంలో 386,విశాఖపట్టణంలో 176, శ్రీకాకుళంలో118, విజయనగరంలో 095 పశ్చిమగోదావరిలో 565కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కరోనాతో 41 మంది చనిపోయారు. చిత్తూరులో ఏడుగురు,కృష్ణాలో ఆరుగురు ప్రకాశంలోఐదుగురు, గుంటూరులో నలుగురు,శ్రీకాకుళంలో ముగ్గురు, అనంతపురం, విశాఖపట్టణంలలో ఇద్దరి చొప్పున చనిపోయారు. కర్నూల్ , నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున చనిపోయారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 12,671 మందికి చేరింది.

ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,53,792, మరణాలు 1046
చిత్తూరు-2,19,348, మరణాలు1601
తూర్పుగోదావరి-2,62,096, మరణాలు 1127
గుంటూరు -1,62,008,మరణాలు 1089
కడప -1,06,223, మరణాలు 605
కృష్ణా -1,01,386,మరణాలు 1112
కర్నూల్ - 1,21,804,మరణాలు 816
నెల్లూరు -1,27,098,మరణాలు 907
ప్రకాశం -1,20,918, మరణాలు 911
శ్రీకాకుళం-1,18,384, మరణాలు 727
విశాఖపట్టణం -1,48,466, మరణాలు 1051
విజయనగరం -80096, మరణాలు 654
పశ్చిమగోదావరి-1,61,202, మరణాలు 1025

 


 

Follow Us:
Download App:
  • android
  • ios