Asianet News TeluguAsianet News Telugu

కోయంబేడు, విదేశీ లింకులు: ఏపీపై కరోనా దెబ్బ, మొత్తం 2627కి చేరిన కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 66 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 2627కి చేరుకొన్నాయి. 
 

andhra pradesh reports 66 more corona cases, total riese to 2627
Author
Amaravathi, First Published May 24, 2020, 1:11 PM IST

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 66 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 2627కి చేరుకొన్నాయి. 

 

11,357 శాంపిల్స్ పరీక్షిస్తే 66 మందికి కరోనా సోకినట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసుల్లో 17 విదేశాల నుండి వచ్చినవారి వల్ల కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వం తెలిపింది.

 

కువైట్ నుండి వచ్చిన 12, దుబాయ్ నుండి వచ్చిన 3, ఖతార్ నుండి వచ్చిన ఇద్దరికి కరోనా సోకినట్టుగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

also read:కరోనాపై పోరు: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు

రాష్ట్రంలో కరోనా సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొంది నయమైన వారు 1807  మంది ఉన్నారని ఏపీ ప్రభుత్వం తెలిపింది. కరోనా సోకి 56 మంది మరణించారు. ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 764 మంది ఉన్నారని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది.కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో కోయంబేడ్ మార్కెట్ తో లింకులు 8 కేసులు ఉన్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios