Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు: మొత్తం 8,95,121కి చేరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో585 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 95వేల 121 కి చేరుకొన్నాయి. 

Andhra pradesh reports 585 new corona cases, total rises to 8,95, 121 lns
Author
Guntur, First Published Mar 24, 2021, 5:11 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో585 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 95వేల 121 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో నలుగురు మరణించారు. చిత్తూరు, గుంటూరు, కర్నూల్, విశాఖపట్టణం జిల్లాల్లో కరోనాతో ఒక్కొక్కరు మరణించారు.  రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,197 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,48,40,401 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 35,066 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో585 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 251 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 94వేల 978మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 2946యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 036, చిత్తూరులో 128,తూర్పుగోదావరిలో 042,గుంటూరులో 099, కడపలో 008,కృష్ణాలో 063, కర్నూల్ లో 035, నెల్లూరులో 023,,ప్రకాశంలో 016, శ్రీకాకుళంలో 022, విశాఖపట్టణంలో 081, విజయనగరంలో 012,పశ్చిమగోదావరిలో 020కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -68,077 మరణాలు 601
చిత్తూరు  -88,624,మరణాలు 859
తూర్పుగోదావరి -1,25,076, మరణాలు 636
గుంటూరు  -76,447, మరణాలు 674
కడప  -55,577, మరణాలు 463
కృష్ణా  -49,497,మరణాలు 683
కర్నూల్  -61,220, మరణాలు 493
నెల్లూరు -62,672, మరణాలు 509
ప్రకాశం -62,324, మరణాలు 582
శ్రీకాకుళం -46,421,మరణాలు 347
విశాఖపట్టణం  -60,611,మరణాలు 570
విజయనగరం  -41,239, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,441, మరణాలు 542

 


 

Follow Us:
Download App:
  • android
  • ios