Asianet News TeluguAsianet News Telugu

విజయనగరంలో నమోదు కాని కరోనా కేసులు: మొత్తం 8,89,974కి చేరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 058 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 89వేల 974 కి చేరుకొన్నాయి. 
 

Andhra pradesh reports 58 new corona cases, total rises to 8,89,974 lns
Author
Guntur, First Published Mar 1, 2021, 9:11 PM IST

 అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 058 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 89వేల 974 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఒక్కరు  కూడా మరణించలేదు.  రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,169 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,39,74,400మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 20,269 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో058 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 051 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 82వేల 080 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 725 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 003, చిత్తూరులో 011,తూర్పుగోదావరిలో 008, గుంటూరులో 007, కడపలో 010, కృష్ణాలో 001, కర్నూల్ లో 006, నెల్లూరులో 004, ప్రకాశంలో 001 శ్రీకాకుళంలో 004, విశాఖపట్టణంలో 001, విజయనగరంలో 000,పశ్చిమగోదావరిలో 002 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,760, మరణాలు 599
చిత్తూరు  -87,493,మరణాలు 849
తూర్పుగోదావరి -1,24,457, మరణాలు 636
గుంటూరు  -75,740, మరణాలు 671
కడప  -55,383, మరణాలు 463
కృష్ణా  -48,921మరణాలు 681
కర్నూల్  -60,886, మరణాలు 489
నెల్లూరు -62,483, మరణాలు 507
ప్రకాశం -62,201, మరణాలు 580
శ్రీకాకుళం -46,221మరణాలు 347
విశాఖపట్టణం  -60,029 మరణాలు 567
విజయనగరం  -41,164, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,336, మరణాలు 542

 


 

Follow Us:
Download App:
  • android
  • ios