24 గంటల్లో కృష్ణాలో అధికం, కర్నూల్లో అత్యల్పం: ఏపీలో 8,78,723 చేరిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 438 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 78వేల 723 కి చేరుకొన్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 438 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 78వేల 723 కి చేరుకొన్నాయి.
గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కరోనా సోకి ఒక్కరి చొప్పున చనిపోయారు..దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,076కి చేరుకొంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,12,60,810 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 64.236 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 0438 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది.
ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 67 వేల445 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 4,202 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
గత 24 గంటల్లో
అనంతపురంలో 20,చిత్తూరులో 080,తూర్పుగోదావరిలో 038, గుంటూరులో 054, కడపలో 014, కృష్ణాలో 083, కర్నూల్ లో 007, నెల్లూరులో 024, ప్రకాశంలో 023, శ్రీకాకుళంలో 014, విశాఖపట్టణంలో 040, విజయనగరంలో 020,పశ్చిమగోదావరిలో 021 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు
అనంతపురం -67,141, మరణాలు 595
చిత్తూరు -85,461,మరణాలు 838
తూర్పుగోదావరి -1,23,305, మరణాలు 636
గుంటూరు -74,282, మరణాలు 660
కడప -54,788, మరణాలు 455
కృష్ణా -47,187,మరణాలు 657
కర్నూల్ -60,490, మరణాలు 487
నెల్లూరు -61,935, మరణాలు 505
ప్రకాశం -61,911, మరణాలు 578
శ్రీకాకుళం -45,833, మరణాలు 346
విశాఖపట్టణం -58,865, మరణాలు 549
విజయనగరం -40,978, మరణాలు 238
పశ్చిమగోదావరి -93,652, మరణాలు 532