Asianet News TeluguAsianet News Telugu

భారీగా తగ్గిన కేసులు: ఏపీలో మొత్తం కేసులు 8,81,061కి చేరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 349 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 81వేల 061 కి చేరుకొన్నాయి. 

andhra pradesh reports 349 new corona cases, total rises to 8,81,061 lns
Author
Amaravathi, First Published Dec 27, 2020, 6:12 PM IST

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 349 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 81వేల 061 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు.  చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో కరోనాతొ ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,094కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,16,20,503 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 46,386 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 0349  మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 70వేల 342 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 3,625 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.


గత 24 గంటల్లో 031,చిత్తూరులో 105,తూర్పుగోదావరిలో 027, గుంటూరులో 034, కడపలో 017, కృష్ణాలో 067, కర్నూల్ లో 010, నెల్లూరులో 011, ప్రకాశంలో 008, శ్రీకాకుళంలో 008, విశాఖపట్టణంలో 028, విజయనగరంలో 00,పశ్చిమగోదావరిలో 003 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,279, మరణాలు 596
చిత్తూరు  -85,936,మరణాలు 840
తూర్పుగోదావరి -1,23,583, మరణాలు 636
గుంటూరు  -74,566, మరణాలు 663
కడప  -54,915, మరణాలు 459
కృష్ణా  -47,568,మరణాలు 664
కర్నూల్  -60,540, మరణాలు 487
నెల్లూరు -62,054, మరణాలు 505
ప్రకాశం -61,991, మరణాలు 578
శ్రీకాకుళం -45,913, మరణాలు 346
విశాఖపట్టణం  -59,054, మరణాలు 549
విజయనగరం  -41,008, మరణాలు 238
పశ్చిమగోదావరి -93,759, మరణాలు 533

 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios