Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు: మొత్తం 8,94,044కి చేరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో310 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 94వేల 044 కి చేరుకొన్నాయి. 

andhra pradesh reports 310 new corona cases, total rises to 8,94,044 lns
Author
Guntur, First Published Mar 22, 2021, 7:48 PM IST


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో310 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 94వేల 044 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,191 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,47,71,701 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 35,375 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో310 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 114 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 84వేల 471మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 2382 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 026, చిత్తూరులో 051,తూర్పుగోదావరిలో 043,గుంటూరులో 028 కడపలో 020,కృష్ణాలో 026, కర్నూల్ లో 021, నెల్లూరులో 013,ప్రకాశంలో 012, శ్రీకాకుళంలో 020, విశాఖపట్టణంలో 043, విజయనగరంలో 007,పశ్చిమగోదావరిలో 000కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -68,012, మరణాలు 601
చిత్తూరు  -88,440,మరణాలు 857
తూర్పుగోదావరి -1,24,866, మరణాలు 636
గుంటూరు  -76,301, మరణాలు 675
కడప  -55,564, మరణాలు 463
కృష్ణా  -49,371,మరణాలు 683
కర్నూల్  -61,165, మరణాలు 492
నెల్లూరు -62,627, మరణాలు 509
ప్రకాశం -62,296 మరణాలు 582
శ్రీకాకుళం -46,389,మరణాలు 347
విశాఖపట్టణం  -60,484,మరణాలు 568
విజయనగరం  -41,225, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,409, మరణాలు 542

 

 

Follow Us:
Download App:
  • android
  • ios