Asianet News TeluguAsianet News Telugu

24 గంటల్లో తూ.గోదావరిలో అత్యధికం, కర్నూల్‌లో అత్యల్పం: ఏపీలో 8,33,208కి చేరిన కరోనా కేసులు

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 2477కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 33 వేల208 కి చేరుకొన్నాయి. 

Andhra pradesh reports 2477 new corona cases, total rises to 8,33,208 lns
Author
Amaravathi, First Published Nov 4, 2020, 5:17 PM IST


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 2477కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 33 వేల208 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 10 మంది కరోనా మరణించారు.కరోనాతో గుంటూరు, కృష్ణా, విశాఖపట్టణం జిల్లాల్లో ఇద్దరి చొప్పున మరణించారు. అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరిలలో ఒక్కరి చొప్పున చనిపోయారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,744 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 83లక్షల 42వేల 265మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 75,465 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2477 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 05 వేల 026మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 21,438 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 052,చిత్తూరులో 321,తూర్పుగోదావరిలో 424, గుంటూరులో 323, కడపలో127 కృష్ణాలో 332, కర్నూల్ లో 035 నెల్లూరులో 094, ప్రకాశంలో 070, శ్రీకాకుళంలో 117, విశాఖపట్టణంలో 122, విజయనగరంలో 085,పశ్చిమగోదావరిలో 375 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -65,029, మరణాలు 569
చిత్తూరు  -79,643,మరణాలు 788
తూర్పుగోదావరి -1,17,207 మరణాలు 615
గుంటూరు  -68,386, మరణాలు 627
కడప  -52,642,మరణాలు 440
కృష్ణా  -40,471, మరణాలు 577
కర్నూల్  -59,600 మరణాలు 482
నెల్లూరు -59,872, మరణాలు 487
ప్రకాశం -60,089 మరణాలు 573
శ్రీకాకుళం -44,300 మరణాలు 342
విశాఖపట్టణం  -56,270 మరణాలు 512
విజయనగరం  -39,592 మరణాలు 230
పశ్చిమగోదావరి -87,210 మరణాలు 502


 

 

Follow Us:
Download App:
  • android
  • ios