Asianet News TeluguAsianet News Telugu

చిత్తూరులో కరోనా ఉధృతి: ఏపీలో తగ్గిన కోవిడ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 71,758 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 2,224 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతోరాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,82,096కి చేరుకొంది.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 29 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 12,630కి చేరింది. 
 

andhra pradesh reports 2224 new corona cases, total rises to 18,82,096 lns
Author
Amaravati, First Published Jun 28, 2021, 5:18 PM IST

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 71,758 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 2,224 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతోరాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,82,096కి చేరుకొంది.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 29 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 12,630కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 4,714మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 18 లక్షల 27 వేల 214 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 42,252 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,18,04,691 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో066,చిత్తూరులో 409, తూర్పుగోదావరిలో299, గుంటూరులో191,కడపలో 173, కృష్ణాలో222, కర్నూల్ లో066, నెల్లూరులో116, ప్రకాశంలో 157,విశాఖపట్టణంలో 122, శ్రీకాకుళంలో051, విజయనగరంలో 093 పశ్చిమగోదావరిలో 259కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కరోనాతో  29 మంది చనిపోయారు. చిత్తూరులోఆరుగురు,తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో కరోనాతో నలుగురి చొప్పున చనిపోయారు.  శ్రీకాకుళంలో నలుగురు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. విశాఖపట్టణం, విజయనగరం జిల్లాల్లో ఒక్కరి చొప్పున మృతి చెందారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 12,630 మందికి చేరింది.

ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,53,602, మరణాలు 1044
చిత్తూరు-2,18,897, మరణాలు1594
తూర్పుగోదావరి-2,61479, మరణాలు 1122
గుంటూరు -1,61,709,మరణాలు 1085
కడప -1,06,086, మరణాలు 605
కృష్ణా -1,01,054,మరణాలు 1106
కర్నూల్ - 1,21,760,మరణాలు 815
నెల్లూరు -1,26,888,మరణాలు 906
ప్రకాశం -1,29,532, మరణాలు 906
శ్రీకాకుళం-1,18,266, మరణాలు 724
విశాఖపట్టణం -1,48,290, మరణాలు 1049
విజయనగరం -80001, మరణాలు 653
పశ్చిమగోదావరి-1,60,637, మరణాలు 1021


 

Follow Us:
Download App:
  • android
  • ios