Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం 8,86,418కి చేరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 196 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 86వేల 418 కి చేరుకొన్నాయి. 
 

Andhra pradesh reports 196 new corona cases, total rises to 8,86,418 lns
Author
Guntur, First Published Jan 20, 2021, 7:13 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 196 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 86వేల 418 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఒక్కరు కూడా మరణించలేదు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,142కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,26,90,165 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 46,852 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో173 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 196 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 77వేల 639 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 1637 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.


గత 24 గంటల్లో అనంతపురంలో 008, చిత్తూరులో 046,తూర్పుగోదావరిలో 012, గుంటూరులో 019, కడపలో 011, కృష్ణాలో 019, కర్నూల్ లో 007, నెల్లూరులో 004, ప్రకాశంలో 007, శ్రీకాకుళంలో 003, విశాఖపట్టణంలో 027, విజయనగరంలో 007,పశ్చిమగోదావరిలో 003 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,570, మరణాలు 597
చిత్తూరు  -86,886,మరణాలు 846
తూర్పుగోదావరి -1,24,097, మరణాలు 636
గుంటూరు  -75,338, మరణాలు 669
కడప  -55,197, మరణాలు 462
కృష్ణా  -48,395,మరణాలు 676
కర్నూల్  -60,751, మరణాలు 487
నెల్లూరు -62,269, మరణాలు 506
ప్రకాశం -62,132, మరణాలు 580
శ్రీకాకుళం -46,078, మరణాలు 347
విశాఖపట్టణం  -59,578, మరణాలు 559
విజయనగరం  -41,115, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,117, మరణాలు 539

 

Follow Us:
Download App:
  • android
  • ios