ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 179 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 85వేల 616 కి చేరుకొన్నాయి. 


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 179 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 85వేల 616 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో నలుగురు మరణించారు. కృష్ణ, విశాఖపట్టణం, చిత్తూరు, గుంటూరులలో ఒక్కొక్కరు చనిపోయారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,138కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,24,82,943 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 41,671మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 179 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 219 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 76వేల 140 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 2,338 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.


గత 24 గంటల్లోఅనంతపురంలో010, చిత్తూరులో 051,తూర్పుగోదావరిలో 017, గుంటూరులో 026, కడపలో 005, కృష్ణాలో 015, కర్నూల్ లో 013, నెల్లూరులో 008, ప్రకాశంలో 009, శ్రీకాకుళంలో 002, విశాఖపట్టణంలో 009, విజయనగరంలో 009,పశ్చిమగోదావరిలో 005 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,549, మరణాలు 597
చిత్తూరు -86,699,మరణాలు 846
తూర్పుగోదావరి -1,24,027, మరణాలు 636
గుంటూరు -75,243, మరణాలు 668
కడప -55,143, మరణాలు 462
కృష్ణా -48,285,మరణాలు 675
కర్నూల్ -60,714, మరణాలు 487
నెల్లూరు -62,247,మరణాలు 506
ప్రకాశం -62,107, మరణాలు 580
శ్రీకాకుళం -46,042, మరణాలు 347
విశాఖపట్టణం -59,485, మరణాలు 557
విజయనగరం -41,097, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,083, మరణాలు 539

Scroll to load tweet…