Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు: కోవిడ్‌తో 13 వేల మంది మృతి

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు 20 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 1435 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఆరుగురు మరణించారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనాతో ఇప్పటికే 13,702 మంది మరణించారు.

andhra pradesh reports 1435 new corona cases, total rises to 20,00,038
Author
Guntur, First Published Aug 20, 2021, 5:14 PM IST


అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో69,173 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 1435మందికి కరోనా నిర్ధారణ అయింది.  రాష్ట్రంలో కరోనా కేసులు 20 లక్షలను దాటాయి.

దీంతోరాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 20,00,038 కి చేరుకొంది.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి ఆరుగురు మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 13,702కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 1695మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 19 లక్షల 70వేల 864 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 15,472 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,59,72,539 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో031,చిత్తూరులో 199, తూర్పుగోదావరిలో178,గుంటూరులో133,కడపలో 053, కృష్ణాలో175, కర్నూల్ లో019, నెల్లూరులో190, ప్రకాశంలో 109,విశాఖపట్టణంలో 097,శ్రీకాకుళంలో050, విజయనగరంలో 047,పశ్చిమగోదావరిలో 154 కేసులు నమోదయ్యాయి.


గత 24 గంటల్లో కరోనాతో  ఆరుగురు  చనిపోయారు.చిత్తూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో  ఇద్దరేసి చొప్పున కరోనాతో మరణించారు..దీంతో రాష్ట్రంలో  కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,702కి చేరుకొంది.

 
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,56,890, మరణాలు 1091
చిత్తూరు-2,35,983, మరణాలు1812
తూర్పుగోదావరి-2,83632, మరణాలు 1246
గుంటూరు -1,71,252,మరణాలు 1172
కడప -1,11,873, మరణాలు 629
కృష్ణా -1,12,307,మరణాలు 1274
కర్నూల్ - 1,23,657,మరణాలు 844
నెల్లూరు -1,38,536,మరణాలు 986
ప్రకాశం -1,32,393, మరణాలు 1031
శ్రీకాకుళం-1,21,612, మరణాలు 773
విశాఖపట్టణం -1,54,171, మరణాలు 1099
విజయనగరం -81,992, మరణాలు 669
పశ్చిమగోదావరి-1,72,845, మరణాలు 1076

 


 

Follow Us:
Download App:
  • android
  • ios