Asianet News TeluguAsianet News Telugu

కరోనాతో ఏడువేలకు పైగా మృతి: ఏపీలో మొత్తం కేసులు 8,90,556కి చేరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 115 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 90వేల 556 కి చేరుకొన్నాయి. 

Andhra pradesh reports 115 new corona cases, total rises to 8,90,556 lns
Author
Guntur, First Published Mar 6, 2021, 6:00 PM IST

 అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 115 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 90వేల 556 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఒక్కరు  మరణించారు.రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,173కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,41,90,477మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 46,566 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో115 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 093 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 82వేల 462 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 921 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 006, చిత్తూరులో 032,తూర్పుగోదావరిలో 005, గుంటూరులో 006, కడపలో 008, కృష్ణాలో 020, కర్నూల్ లో 005, నెల్లూరులో 000, ప్రకాశంలో 000,శ్రీకాకుళంలో 006, విశాఖపట్టణంలో 018, విజయనగరంలో 001,పశ్చిమగోదావరిలో 008 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,801, మరణాలు 600
చిత్తూరు  -87,644,మరణాలు 852
తూర్పుగోదావరి -1,24,507, మరణాలు 636
గుంటూరు  -75,783, మరణాలు 671
కడప  -55,407, మరణాలు 463
కృష్ణా  -48,991మరణాలు 681
కర్నూల్  -60,916, మరణాలు 489
నెల్లూరు -62,503, మరణాలు 507
ప్రకాశం -62,209, మరణాలు 580
శ్రీకాకుళం -46,257మరణాలు 347
విశాఖపట్టణం  -60,113మరణాలు 567
విజయనగరం  -41,169, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,361, మరణాలు 542

Follow Us:
Download App:
  • android
  • ios