Asianet News TeluguAsianet News Telugu

చిత్తూరులో కరోనా జోరు: ఏపీలో మొత్తం కేసులు 20,450,524కి చేరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో1010 మందికి కరోనా నిర్ధారణ అయింది.  రాష్ట్రంలో కరోనా కేసులు 20,450,524కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 13 మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,176 కి చేరింది.

andhra pradesh reports 1010 new corona cases, total rises to 20,450,524
Author
Guntur, First Published Sep 30, 2021, 4:56 PM IST

అమరావతి:ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) రాష్ట్రంలో కరోనా (corona cases) కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో58,054మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 1010 మందికి కరోనా నిర్ధారణ అయింది.  రాష్ట్రంలో కరోనా కేసులు 20,450,524కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 13 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 14,176 కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 1149 మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 20లక్షల 24వేల 645 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 11,503 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,82,93,704 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో009,చిత్తూరులో 218, తూర్పుగోదావరిలో175,గుంటూరులో100,కడపలో 030, కృష్ణాలో084, కర్నూల్ లో000, నెల్లూరులో074, ప్రకాశంలో 129,విశాఖపట్టణంలో 060,శ్రీకాకుళంలో007, విజయనగరంలో 009,పశ్చిమగోదావరిలో 113 కేసులు నమోదయ్యాయి.


గత 24 గంటల్లో కరోనాతో  13 మంది చనిపోయారు.చిత్తూరులో ఐదుగురు,గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించారు.తూర్పుగోదావరి, కడప, కృష్ణ, నెల్లూరులలో ఒక్కొక్కరి చొప్పున కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో  కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,176కి చేరుకొంది.

 
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,57,606, మరణాలు 1092
చిత్తూరు-2,43,926, మరణాలు1918
తూర్పుగోదావరి-2,91,311, మరణాలు 1282
గుంటూరు -1,75,975,మరణాలు 1210
కడప -1,15,014, మరణాలు 639
కృష్ణా -1,17,475,మరణాలు 1380
కర్నూల్ - 1,24,016,మరణాలు 851
నెల్లూరు -1,44,950,మరణాలు 1038
ప్రకాశం -1,37,289, మరణాలు 1095
శ్రీకాకుళం-1,22,710, మరణాలు 783
విశాఖపట్టణం -1,56,647, మరణాలు 1119
విజయనగరం -82,762, మరణాలు 669
పశ్చిమగోదావరి-1,77,748, మరణాలు 1103

 


 

Follow Us:
Download App:
  • android
  • ios