Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో కరోనా జోరు: 5 లక్షలకు చేరువలో కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 10,794 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,98,125కి చేరుకొన్నాయి.

andhra pradesh reports 10,794 new corona cases, total rises to 4,98,125
Author
Amaravathi, First Published Sep 6, 2020, 5:34 PM IST

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 10,794 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,98,125కి చేరుకొన్నాయి.

గత 24 గంటల్లో 68 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,417కి చేరుకొన్నాయి.రాష్ట్రంలో 99,689 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా సోకి కోలుకొన్న వారి సంఖ్య రాష్ట్రంలో 3,94,019కి చేరుకొంది.

గత 24 గంటల్లో అనంతపురంలో 753, చిత్తూరులో 927,తూర్పుగోదావరిలో 1244,గుంటూరులో703, కడపలో904,కృష్ణాలో457,కర్నూల్ లో380, నెల్లూరులో 1299, ప్రకాశంలో 1042, శ్రీకాకుళంలో 818, విశాఖపట్టణంలో 573, విజయనగరంలో 593, పశ్చిమగోదావరిలో 1101 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో చిత్తూరులో 9 మంది, అనంతపురం, గుంటూరులలో 8 మంది మరణించారు.. కడపలో ఏడుగురు, తూర్పుగోదావరి, విశాఖపట్టణం, పశ్చిమగోదావరిలలో ఐదుగురు, కృష్ణ, కర్నూల్, నెల్లూరులలో నలుగురి చొప్పున మరణించారు. శ్రీకాకుళంలో ఇద్దరు, విజయనగరంలో ఒక్కరు మరణించారు.


రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కరోనా కేసులు, మరణాలు

అనంతపురం-45,300, మరణాలు 367
చిత్తూరు- 42,561, మరణాలు 473
తూర్పుగోదావరి -66,948, మరణాలు 427
గుంటూరు -40,135, మరణాలు 419
కడప - 31,481, మరణాలు 250
కృష్ణా -18,482, మరణాలు 308
కర్నూల్ -48,386, మరణాలు 395
నెల్లూరు-37,278, మరణాలు 342
ప్రకాశం-29,074, మరణాలు 320
శ్రీకాకుళం -27,984, మరణాలు 263
విశాఖపట్టణం -23,911, మరణాలు 320
విజయనగరం -23,911, మరణాలు 180
పశ్చిమగోదావరి-42,903, మరణాలు 353

 

 

Follow Us:
Download App:
  • android
  • ios