ఏపీకి పుష్కలంగా పర్యాటక అవకాశాలు.. ఈ రంగం అభివృద్దికి మరిన్ని చర్యలు తీసుకుంటాం.. : మంత్రి ఆర్కే రోజా
Vijayawada: పర్యాటక సంబంధిత వాణిజ్య సంస్థలను నమోదు చేయడానికి పర్యాటక శాఖ ప్రయత్నాలు ప్రారంభించిందనీ, దీనిలో భాగంగా 'టూరిజం ట్రేడ్ (రిజిస్ట్రేషన్ అండ్ ఫెసిలిటేషన్) - 2020' ద్వారా, పర్యాటక సేవల ప్రమాణాలను ప్రభుత్వం మెరుగుపరిచిందని మంత్రి రోజా అన్నారు. హోటళ్లు, రిసార్ట్స్, హోమ్ స్టేలు, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆపరేటర్లు పోర్టల్ లో నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.
Andhra Pradesh Tourism Sector: పర్యాటక రంగం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ కు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే. రోజా అన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. 'ఇంటిగ్రేటెడ్ సస్టైనబుల్ టూరిజం ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ ఏపీ స్టేట్ (ఐఎస్టీపీఎం 2023)' అనే అంశంపై సౌత్ జోన్ సద్సులో మంత్రి రోజా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అలాగే, సమగ్ర, మెరుగైన టూరిజం ప్రణాళికను రూపొందించడంలో ఇది సహాయపడుతుందని చెప్పారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా(ఐటీపీఐ), ఏపీ టూరిజం డిపార్ట్ మెంట్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి.
పర్యాటక సంబంధిత వాణిజ్య సంస్థలను నమోదు చేయడానికి పర్యాటక శాఖ ప్రయత్నాలు ప్రారంభించిందనీ, దీనిలో భాగంగా 'టూరిజం ట్రేడ్ (రిజిస్ట్రేషన్ అండ్ ఫెసిలిటేషన్) - 2020' ద్వారా, పర్యాటక సేవల ప్రమాణాలను ప్రభుత్వం మెరుగుపరిచిందని మంత్రి రోజా అన్నారు. హోటళ్లు, రిసార్ట్స్, హోమ్ స్టేలు, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆపరేటర్లు పోర్టల్ లో నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.
ఈ సదస్సులో వివిధ రాష్ట్రాలకు చెందిన టౌన్ ప్లానింగ్ డైరెక్టర్లు, ప్రభుత్వ, ప్రయివేటు, కార్పొరేట్ రంగ నిపుణులు పాల్గొన్నారని రోజా తెలిపారు. "పర్యాటకం కోసం ప్రచారంలో ప్రణాళిక కీలక పాత్ర పోషిస్తుంది. పర్యాటకం, టౌన్ ప్లానింగ్, సాంస్కృతిక ఆకర్షణలు పర్యాటక పటంలో ఎలా చేర్చబడతాయనే దానిపై ఆధారపడి ఉంటాయి. ఏపీ టూరిజం పాలసీ-2020-25లో వ్యాపార నిబంధనలు మరింత సరళంగా మారి సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భూమి వినియోగం, నిర్మాణ అనుమతులు, పర్యావరణ రిజిస్ట్రేషన్లు, యుటిలిటీ పర్మిట్లు, పన్నుల చెల్లింపు, ప్రోత్సాహకాలు, పెట్టుబడి ఆధారిత ఫీచర్లలో సింగిల్ విండో క్లియరెన్స్ మరింత సరళంగా మారింది" అని ఆమె వివరించారు. పర్యాటక సంబంధిత వాణిజ్య సంస్థలను నమోదు చేయడానికి పర్యాటక శాఖ ప్రయత్నాలు ప్రారంభించింని తెలిపాన మంత్రి రోజా.. 'టూరిజం ట్రేడ్ (రిజిస్ట్రేషన్ అండ్ ఫెసిలిటేషన్) - 2020' ద్వారా, పర్యాటక సేవల ప్రమాణాలను మెరుగుపరిచిందన్నారు. హోటళ్లు, రిసార్ట్స్, హోమ్ స్టేలు, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆపరేటర్లు పోర్టల్ లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
పర్యాటకం ఆర్థిక పరంగానే కాకుండా జ్ఞానం-మానవ సంక్షేమానికి కూడా నేటి అభివృద్ధిలో ఒక ముఖ్యమైన భాగంగా మారిందని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అందుబాటులో ఉన్న కార్యాచరణగా మారినందున అన్ని పర్యాటక సామర్థ్యాలను అన్వేషించడానికి, ప్రోత్సహించడానికి ఈ సమావేశం తోడ్పడుతుందని తెలిపారు. అభివృద్ధి సాధనంగా పర్యాటకం, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థ, గ్రామీణ పర్యాటకం, పర్యాటక-సంస్కృతి-వారసత్వం, స్థిరమైన పర్యాటక వ్యూహాలు, స్థిరమైన పర్యాటక ప్రణాళిక, పాలన అనే ఐదు ఇతివృత్తాలపై ఇది దృష్టి పెట్టిందని తెలిపారు. ఈ సమావేశంలో ఐటీపీఐ సెక్రటరీ జనరల్ ప్రదీప్ కపూర్, పర్యాటక శాఖ డిప్యూటీ సీఈవో రాముడు, ఏపీటీడీసీ రీజనల్ డైరెక్టర్ రమణప్రసాద్, ఏపీటీడీసీ డీవీఎం ఎం గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.