Asianet News TeluguAsianet News Telugu

క్రిస్మస్ పండుగ సందర్భంగా... రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ ‌శుభాకాంక్షలు

క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర  ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరిగేలా ఎల్లప్పుడూ దేవుడి ఆశీస్సులు లభించాలని  ఆకాంక్షించారు. 
 

Andhra Pradesh CM Jagan Christas Wishes To People - bsb
Author
Hyderabad, First Published Dec 24, 2020, 1:58 PM IST

క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర  ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరిగేలా ఎల్లప్పుడూ దేవుడి ఆశీస్సులు లభించాలని  ఆకాంక్షించారు. 

సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమా గుణం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని, క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయి అని సీఎం ‌ జగన్‌ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios