Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ దరువు వేస్తారని భయం: చంద్రబాబుపై అంబటి రాంబాబు

టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వానికి కూడా విరాళం ఇచ్చారు కదా, ఆ ప్రభుత్వానికి ఎందుకు సలహా ఇవ్వరని ఆయన అన్నారు.

Amabati Rambabu lashes out at TDP chief Chandrababu
Author
Guntur, First Published Apr 25, 2020, 4:29 PM IST

గుంటూరు: రాష్ట్రంలో 1,016 మంది మాత్రమే కరోనా వ్యాధి సోకిన వారు ఉన్నారా... ఇంకా లేరా అంటే... ఉండి ఉండచ్చు కూడా అని, ఎందుకంటే కొందరిని ఐడెంటిఫై చేయలేకపోవచ్చునని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కొందరికి అది వచ్చిన సంగతిగాని... పోయిన సంగతి గాని తెలియనటువంటి దశ కూడ ఒకటి ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్న సందర్భమని, అందువల్ల ఇంకా కూడా చాలామందికి వచ్చిఉండచ్చు.తగ్గిఉండచ్చునని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్దితి నుంచి ఎప్పుడు బయటపడతాం అనేదానికి సమాధానం త్వరగా దొరకడం లేదని ఆయన అన్నారు. 

దీనికి మందు కనిపెట్టిన తర్వాత మాత్రమే శాశ్వత పరిష్కారం ఉంటుందని అంబటి రాంబాబు శనివారం మీడియా సమావేశంలో అన్నారు. అప్పటిదాకా మనం లాక్ డౌన్ లో ఉండాలా లేక సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ముందుకు వెళ్లాలా అని మానవాళి అంతా ఆలోచిస్తున్న అంశమని, కంప్లీట్ లాక్ డౌన్ కొంతమేరకు ఈ వ్యాధిని అరికట్టేందుకు ఉపయోగపడుతుంది కాని  సమాజం దెబ్బతినేపోయే పరిస్దితి ఉంటుందని, దీనిపై మేధావులందరూ ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, మేధావులు అందరూ ఆలోచించి మూడోతేదీ తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అందరూ అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 

ఇది ఒక విపత్కరమైన పరిస్ధితి అని, దేశంలోని వారంతా ఐక్యంగా పోరాడుతున్న సందర్భమని ఆయన అన్నిారు. అలాగే రాష్ర్టంలో కూడా ప్రభుత్వం, మేధావులు,వైద్యులు పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.ఉద్యోగులైతే ఫ్రంట్ రోలో ఉండి పనిచేస్తున్నారని, ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నప్పుడు కొందరి ప్రాణాలు కూడ పోతున్నాయని ఆయన అన్నారు. కొందరికి కరోనా వ్యాధి కూడా సోకుతోందని, వారు ఇబ్బంది పడుతున్న పరిస్ధితి మనం చూస్తున్నామని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో శ్రీ వైయస్ జగన్  నేతత్వంలోని ప్రభుత్వం కోవిడ్-19 ని అరికట్టేందుకు చిత్తశుద్దితో పనిచేస్తోందని అన్నారు.  కొందరు చేస్తున్న రాళ్లేసేకార్యక్రమం కొద్దిగా బాధగా అనిపిస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబు సిఎంగా 14 సంవత్సరాలు పనిచేసి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్నారని ఆయన అన్నారు. విమర్శలు చేస్తూ సలహాలు ఇస్తున్నామని అంటారని ఆయన అన్నారు. నెలరోజుల లాక్ డౌన్ కాలంలో ఒక్క మంచి సలహా చంద్రబాబు ఇచ్చిన పాపాన పోలేదని ఆయన అన్నారు. ఏదైనా ఇచ్చి ఉంటే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బురదచల్లే కార్యక్రమం....రాష్ర్టంలో ఉండి చేస్తున్నారా అంటే అలా కాదు....అది కూడా హైద్రాబాద్ లో ఉండి బురదచల్లుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

అప్పుడప్పుడు స్కైప్ లో వస్తారని, సుధీర్ఘమైన ఉపన్యాసాలు చెబుతారని, మొన్న  టిడిపి ఎన్ఆర్ఐ మీటింగ్ లో చూశానని, వారంతా భజన చేస్తూ.... ఇప్పుడు మీరు ఉండి ఉంటే అద్భుతంగా, చాలా గొప్పగా ఉండేదంటూ మాట్లాడుతున్నారని, ఏం అద్భుతంగా ఉండేదండి... సొల్లు చెప్పే కార్యక్రమం... గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చి మీడియా స్పేస్ నంతా ఆక్రమించుకోవాలనే తాపత్రయం తప్ప మరోటి కనిపించడం లేదని ఆయన అన్నారు. 

"గోదావరి పుష్కరాలలో ఎంతమంది మరణానికి మీరు కారణమయ్యారు. అయితే మీకు,మాకు తేడా ఉంది. జగన్ కి గంటలతరబడి ఉపన్యాసాలు చెప్పేటందుకు ప్రావీణ్యత లేదు. పనిచేయడంలో మాత్రమే ఆయనకు ప్రావీణ్యత ఉంది.ఈరోజు రాష్ర్టంలో ఐఏఎస్, ఐపిఎస్ అధికారులందరితోను కలసికట్టుగా టీమ్ వర్క్ చేస్తున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ గారు ఉన్నారు. అందరితో రివ్యూలు చేస్తూ,చర్చిస్తున్నారు .ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా దానిని పరిష్కరించాలనే ప్రయత్నం చేస్తున్నారు" అని అన్నారు.

"అన్నింటిని సమపాళ్లలో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న జగన్ గారిపై హైద్రాబాద్ లో కూర్చుని చంద్రబాబు రాళ్లేస్తున్నారు.మీరు వేరే రాష్ర్టంలో ఉన్నారు.ఆ రాష్ట్రానికి, ఏపికి హెరిటేజ్ ఫుడ్స్ నుంచి చెరి 30 లక్షల రూపాయలు చందా ఇచ్చారు. మీరు పర్సనల్ గా పది లక్షలు ఇచ్చారు.రెండు రాష్ట్రాలు నాకు సమానమే అన్నారు. మంచిదే డబ్బులు ఇవ్వడంలో మీకు సమానం. కాని సలహాలు ఇవ్వడంలో సమానం ఎందుకు లేదండి.....అని అడుగుతున్నాను" అని అంబటి రాంబాబు అన్నారు.

"ఆ రాష్ర్టంలో వారికి సలహాలు ఇవ్వరు. అక్కడ ఏమీ డిమాండ్ చేయరు. ఇస్తే కేసిఆర్ దరువు వేస్తారనే భయం. ప్రధానమంత్రి నరేంద్రమోది, అమిత్ షా కాళ్లు పట్టుకుంటానికి ప్రయత్నం చేస్తారు. వాళ్లు మీకు కాళ్లు దొరకనివ్వరు.అక్కడొక(తెలంగాణ) రకంగా వ్యవహరిస్తారు.ఇక్కడొక రకంగా వ్యవహరిస్తారు.ఇక్కడ రాళ్లు వేయడం ధర్మం కాదని చెబుతున్నాను" అని అన్నారు.

"అదేమంటే చంద్రబాబు అంటున్నారు. ఏపి ప్రభుత్వం వాస్తవాలు దాస్తోంది. కరోనా రోగులు ఎంతమంది ఉన్నారో చెప్పడం లేదంట. వాస్తవాలు దాయాల్సిన అవసరం ఎందుకుంటుంది.ఎందుకు ఆ విధంగా బురదచల్లే కార్యక్రమం చేస్తారు.విమర్శలు చేస్తారు.మీతోపాటు బిజేపి రాష్ర్ట అధ్యక్షులు కూడా ఇదే విధంగా అన్నారు" అని అన్నారు.

"హైకమాండ్ మొట్టికాయలు మొట్టినట్లు ఉంది. ఆయన (కన్నా లక్ష్మినారాయణ) సర్దుకున్నాడు. చంద్రబాబుతో ప్రయాణం చేయకండి దూరంగా ఉండండి. బాబుతో కలసి భజన చేయకండని బిజేపి జాతీయ అధ్యక్షులు చెబితే ఆయన సర్దుకున్నారు.వాస్తవాలు చెప్పకుండా దాయడం అనేది ఈ ప్రభుత్వానికే కాదు ఏ ప్రభుత్వానికి కూడా ఉండటానికే వీల్లేదు.ఉన్న వాస్తవాలు స్పష్టంగా చెబుతున్నా కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు.ఇది దుర్మార్గమైన ఆలోచన" అని రాంబాబు అన్నారు.

"ఈ  సమయాన్ని మీరు ఎంచుకుని జగన్ ప్రభుత్వంపై రాళ్లు వేసే ప్రయత్నం చేయడం ధర్మం కాదు.మీరు హైద్రాబాద్ లో ఉన్నారు.ఈ రాష్ర్టంలో మీకు ఇల్లుందన్నారు కదా..... పరిపాలన చేశారు.ఎందుకు ఈ రాష్ట్రానికి రారు. ఇక్కడ ఉండకండా ఆ రాష్ర్టంలో దాక్కోవాల్సిన ఖర్మ ఏం పట్టింది. ఇది నైతికతేనా. నా ప్రజలు బాధపడుతున్నప్పుడు ...నా ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ఆ ప్రజల మధ్యకు వెళ్లి సలహాలు ఇవ్వాలనే జ్ఞానం మీకు ఎందుకు లేదు. ప్రజల పట్ల ప్రేమ లేదు.రాజకీయం చేయాలనే దుర్భుద్ది తప్ప మరోటి కనబడటం లేదు" అని అన్నారు.

"నేను ఉన్నాను ఈరోజున....గుంటూరులో ఉంటున్నాను...సత్తెనపల్లిలో నన్ను ఎన్నుకున్నారు. రెండురోజులకైనా సత్తెనపల్లి వెళ్లి అధికారులతో మాట్లాడకపోతే నాకు నిద్రపట్టదు.ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ఎలా  సహాయం చేయాలనే తాపత్రయం.ఆ తాపత్రయం మీ దగ్గర ఏది.పోనీ మీకు లేదు.... మీకు 70  ఏళ్లు వచ్చాయి.మా లాగానే వృధ్ధులు ...కరోనా సోకితే ప్రమాదం. మీరు రావడం లేదు సరే మంచిదే. మీ అబ్బాయి,యువకుడు, ఆరోగ్యవంతుడు...మీ వారసుడు...మంగళగిరిలో పోటీచేసి దురదృష్టంకొద్ది ఓడిపోయాడు.ఆయన ఎందుకు ఈ రాష్ట్రానికి రాడు. ఆయన ఎందుకు సలహాలు ఇవ్వడు.మీకు సంబంధించిన ఎంఎల్ఏ ఒక్కరైనా సహాయకార్యక్రమాలలో పాల్గొన్నారా....సహాయం చేయాలనే ప్రయత్నం చేశారా.ఇళ్లకే పరిమితం అయి ఇళ్లల్లో కూర్చున్నారు" అని అంబటి అన్నారు.

"అదేమంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ లు, మంత్రులు లాక్ డౌన్ లో బయటకువస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారూ అంటూ విమర్శలు చేస్తున్నారు.అలా చేస్తూ కరోనా వ్యాప్తి చెందేలా చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు.అందరికి మనవి చేస్తున్నాను.రాబోయే కాలం కరోనాతోనే మనం జీవించాలి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మన కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాలి. ఈ రోజు మా ఎంఎల్ ఏలు నియోజకవర్గాలలోని పేదవారిని ఎలా ఆదుకోవాలి.... రెక్కాడితే గాని డొక్కాడని వారికి నాలుగువేళ్లు లోపలికి వెళ్లేలా ఏం చేయాలి....మనం సహాయం చేయాలా...ఎన్ జి ఓల ద్వారా సహాయం చేయించాలా అనే తాపత్రయంతో ఎంఎల్ ఏలు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ముందుకు వెళ్తుంటే వారిపై కూడా బురదచల్లుతున్నారు.గుంటూరులో ఎక్కువ కేసులు ఉంటే గుంటూరు ఎంఎల్ఏది బాధ్యతా... నరసరావుపేటలో ఎక్కువ కేసులు ఉంటే నరసరావుపేట ఎంఎల్ఏది బాధ్యతా... మా సత్తెనపల్లిలో ఒకే ఒక్క కేసు ఉంది. నేను గొప్పవాడినా కాదు....కొన్ని ప్రత్యేక పరిస్ధితుల వలన.... విదేశాలనుంచి వచ్చిన వారి వల్లనో.నిజాముద్ధీన్ కు వెళ్లి వచ్చినవారి వల్లనో కొన్ని ప్రాంతాలలో కరోనా వ్యాప్తి జరుగుతోంది" అని ఆయన వివరించారు.

"కరోనా వ్యాప్తి కాకుండా ఉండేందుకు సిస్టమాటిక్ గా చేయాలని ప్రభుత్వం వ్యవహరిస్తుంటే దానిని సైతం విమర్సించే విధంగా చంద్రబాబు ఆయన తాబేదార్లు పనిచేస్తున్నారు.ఇది సరైన విధానం కాదు. మీరు హైద్రాబాద్ లో కూర్చోండి...సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండండి... ఆ బంగ్లాలోనే ఉండండి.... కాని ఈ విధంగా ప్రభుత్వాన్ని,వైద్యులను,ఐపిఎస్,ఐఏఎస్ అధికారులను డిమోరలైజ్ చేయాలనే విధంగా మీరు చూడటం సరైనవిధానం కాదు.చంద్రబాబుగారు మీరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించకండి... బాధ్యతతో వ్యవహరించండి.సద్విమర్శలు చేయండి. మంచి సలహాలు స్వీకరించేందుకు ఈ ప్రభుత్వం చిత్తశుధ్దితో ఉంది" అని అంబటి రాంబాబు అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios