అన్నమయ్య  జిల్లాలోని  ఓబులవారిపల్లెలో  విషాదం చోటు చేసుకుంది.  మంగంపేట  బైరెటీస్  లో  బ్లాస్టింగ్ తో  అగ్రహరం  గ్రామంలో  నాలుగేళ్ల   బాలుడు  మృతి  చెందాడు.  బాలుడి  మృతితో  అగ్రహరం గ్రామస్తులు  ఏపీఎన్ఎండీసీ  కార్యాలయం ముందు  ధర్నాకు  దిగారు.

చిత్తూరు: అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లెలో విషాద చోటు చేసుకుంది. మంగంపేట బైరెటీస్ లో బ్లాస్టింగ్ తో పేలుడుతో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ బ్లాస్టింగ్ పనులతో అగ్రహరం గ్రామంలో ఓ ఇంటి గోడ కూలింది. గోడ మీద పడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతదేహంతో ఏపీఎన్ఎండీసీ కార్యాలయం ముందు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బ్లాస్టింగ్ ల కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అగ్రహరం గ్రామస్తులు చెబుతున్నారు. బ్లాస్టింగ్ లను నిలిపివేయాలని అగ్రహరం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.