విజయవాడ దుర్గగుడిలో ఏసీబీ సోదాలు
విజయవాడలోని ప్రఖ్యాత కనక దుర్గమ్మ ఆలయంలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై స్టోర్, చీరల విభాగంలో ఏసీబీ దాడులు చేసింది. వీటితో పాటు పరిపాలన విభాగాలు, ప్రసాదాల తయారీ విభాగాల్లో సోదాలు చేశారు.
విజయవాడలోని ప్రఖ్యాత కనక దుర్గమ్మ ఆలయంలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై స్టోర్, చీరల విభాగంలో ఏసీబీ దాడులు చేసింది. వీటితో పాటు పరిపాలన విభాగాలు, ప్రసాదాల తయారీ విభాగాల్లో సోదాలు చేశారు.
మొత్తం 4 బృందాలుగా తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. అలాగే అధికారులు, సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.