Asianet News TeluguAsianet News Telugu

శ్రీవారికి రూ.1.8 కోట్ల స్వర్ణనందకం విరాళం ఇచ్చిన హైదరాబాద్ భక్తుడు..

స్వర్ణ నందకం కోసం 6.5 కేజీల బంగారాన్ని వినియోగించినట్టు భక్తుడు తెలిపారు. ఈ సందర్భంగా దాతలను తితిదే అధికారులు అభినందించారు. రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందించారు.

A Hyderabad devotee donated Rs 1.8 crore Swarnanandakam to Tirumala - bsb
Author
Hyderabad, First Published Jul 19, 2021, 11:32 AM IST

తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు ఎం.ఎస్‌.ప్రసాద్‌ రూ.1.8 కోట్ల విలువైన స్వర్ణ నందకాన్ని విరాళంగా అందజేశారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామిని దర్శించుకున్న ప్రసాద్‌ దంపతులు స్వర్ణ ఆభరణాన్ని బహూకరించారు. 

A Hyderabad devotee donated Rs 1.8 crore Swarnanandakam to Tirumala - bsb

స్వర్ణ నందకం కోసం 6.5 కేజీల బంగారాన్ని వినియోగించినట్టు భక్తుడు తెలిపారు. ఈ సందర్భంగా దాతలను తితిదే అధికారులు అభినందించారు. రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందించారు.

‘శ్రీవారికి అన్నమయ్య ద్వారా శ్రీ మహావిష్ణువు నందకాన్ని అందించిన తరహాలో ఓ స్వర్ణ నందకం తయారుచేయాలని సంకల్పించాం. అందులో భాగంగా ప్రస్తుతం స్వామికి ఉన్న ‘సూర్యకఠారి’ (ఖడ్గం) కొలతలతో స్వర్ణ నందకాన్ని తమిళనాడులోని కోయంబత్తూరులో తయారు చేయించాం’ అని ప్రసాద్‌ ఆదివారం మీడియాకు వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios