కృష్ణా జిల్లాలో ఓ అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక ఇంటి వద్ద దించాలని ఆటోలో ఎక్కింది. అయితే ఆ డ్రైవర్ వేరే ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారినికి ఒడిగట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని, అతడి స్నేహితుడిని అరెస్టు చేశారు.
మహిళలపై నిత్యం అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తెచ్చిన కామాంధులకు భయం వేయడం లేదు. దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో మహిళలు, బాలికలపై లైంగిక వేధింపుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వావి వరసలు మరిచి లైంగిక దోపిడికి ఒడిగడుతున్నారు. పరిచయం ఉన్న వారే కదా అని నమ్మి వెళ్తే.. పలువురు దానిని వమ్ము చేసి తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు.
ఫిరాయింపు రాజకీయాలే బీజేపీ ఆయుధం.. ఎం కే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
తాజాగా ఏపీలోని కృష్ణా జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. గ్రామస్తుడే కదా అని ఆటో ఎక్కితే ఆ డ్రైవర్ బాలికను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి అదే ఆటోలో ఉన్న ఓ స్నేహితుడు సహకరించాడు. ఈ ఘటనపై బాలిక ఫిర్యాదు చేయడంతో ఇద్దరినీ అరెస్టు చేశారు. ‘ఈనాడు’ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక తన ఇంటికి వెళ్లాలని ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఎదురుచూస్తోంది.
మణిపూర్ లో భారీ ఉగ్రకుట్రకు ప్లాన్.. ఆ రెండు దేశాల ఉగ్ర సంస్థలతో లింకులు.. నిందితుడి అరెస్ట్..
ఈ క్రమంలో బాలిక గ్రామానికి చెందిన 22 ఏళ్ల కుంపటి చందు అనే డ్రైవర్ తన ఆటోలో 17 ఏళ్ల స్నేహితుడితో కలిసి తన ఊరికు వెళ్తున్నాడు. ఆ ఆటోను బాలిక ఆపింది. తనను ఇంటి వద్ద దిగబెట్టాలని వారిని కోరింది. దీనికి వారు ఒప్పుకున్నారు. అయితే ఆటోలో ఎక్కిన తరువాత బాలికకు ఏదో మాయమాటలు చెప్పారు. ఆటోను రొయ్యూరుకు తీసుకొని వెళ్లారు
ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 8 మంది మృతి, పలువురికి గాయాలు
తరువాత డ్రైవర్ చందు మద్యం తాగాడు. అనంతరం బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఇంటికి వెళ్లిన తరువాత బాధితురాలు తనపై జరిగిన ఘోరాన్ని తల్లికి వివరించింది. దీంతో ఆమె పోలీసులకు ఆశ్రయించింది. కూతురుపై జరిగిన అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడి అరెస్టు చేశారు. అలాగే అతడికి సహకారం అందించిన నిందితుడి స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.