Asianet News TeluguAsianet News Telugu

ఏపీ: 24 గంటల్లో 523 మందికి పాజిటివ్.. రాష్ట్రంలో 20,58,915కి చేరిన కరోనా కేసుల సంఖ్య

ఏపీలో కొత్తగా 523 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 608 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 5,566 మంది చికిత్స పొందుతున్నారు

523 new corona cases reported in andhra pradesh
Author
Amaravati, First Published Oct 20, 2021, 7:18 PM IST

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో కొత్తగా 523 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,58,915కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,320కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల ప్రకాశం జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 608 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,39,029 కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 44,086 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,91,00,342 కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 5,566 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 21, చిత్తూరు 87, తూర్పుగోదావరి 54, గుంటూరు 78, కడప 23, కృష్ణ 61, కర్నూలు 2, నెల్లూరు 46, ప్రకాశం 16, శ్రీకాకుళం 15, విశాఖపట్నం 43, విజయనగరం 11, పశ్చిమ గోదావరిలలో 66 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios