ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దారుణ సంఘటన జరిగింది. మంచంపై నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి ఓ కామాంధుడు ఆమెపై అత్యాచారం చేశాడు.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి అమానుషమైన చర్యకు పాల్పడ్డాడు. ఇంట్లో నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి ఆమెపై ఆగంతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
అర్థరాత్రి మెలుకువ వచ్చి చూసేసరికి మంచంపై బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అన్వేషణ ప్రారంభించారు. చివరకు బాలిక ఊరి చివర దేవాలయం వద్ద కనిపించింది. ఒంటిపై దుస్తులు లేవు, శరీరంపై గాయాలు కనిపించాయి.
వెంటనే బాలికను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు చెప్పకుండా వైద్యుులు చికిత్స అందించడానికి నిరాకరించారు. దీంతో వైద్యులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Nov 25, 2020, 11:15 AM IST